పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)

కేంద్ర ప్రభుత్వం గాంధీ పై కుట్రతో వ్యవహరిస్తోందని, రాబోయే రోజుల్లో కరెన్సీ పై కూడా గాంధీ బొమ్మ లేకుండా చేసే మోడీ సర్కార్ చేసే ప్రమాదం ఉందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పేదలతో అనుసంధానమైన కీలక పథకంలో గాంధీ పేరు లేకుండా చేసిందని, గాంధీని దేశ ప్రజలు విస్మరించే విధంగా బీజెపి విధానాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు స్వేఛ్చగా జీవించాలని మహాత్మగాంధీ నేతృత్వంలో నెహ్రూ కుటుంబం శాంతి యుతంగా పోరాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని జగ్గా రెడ్డి అన్నారు. పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో జగ్గారెడ్డి, నిర్మాలా జగ్గారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో మోదీ, అమిత్ షా పాత్ర లేదు. స్వాతంత్రం వచ్చినపుడు వారు ఇంకా పుట్టనే లేదు. కానీ జవహర్ లాల్ నెహ్రూ ఏం దేశానికి ఏం చేశారని మోదీ, అమిత్ షా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. దేశ స్వాతంత్రం కోసం జవహర్ లాల్ నెహ్రూ12 ఏళ్లు జైలు జీవితం గడిపారు. ఈ దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ కూడా జైలుకు వెళ్లారని చెప్పారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి మోదీ, అమిత్ షా పని చేస్తున్నారని, ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. దేశప్రజలు సుఖ శాంతులతో బతకాలన్నా, హక్కులు పొందాలన్నా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలన్నారు.









Leave a Reply