NewsInn

News in a Click

సిగాచి మృతుల కుటుంబాల‌కు యాజ‌మాన్యం మొండి చేయ్యి

సీఇఓ ను అరెస్టు చేసిన పోలీసులు

ప్ర‌భుత్వం నిర్ణ‌యం పైనే బాధిత కుటుంబాలు ఆశలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

భారీ ప్ర‌మాదం జ‌రిగి 54 మంది కార్మికులు మృతి చెందిన సంఘ‌ట‌న‌లో కంపెనీ కార్మికుల‌కు న‌ష్ట ప‌రిహారం ఇవ్వ‌క‌పోవ‌డంతో సీఇఓ ను పోలీసులు అరెస్టు చేశారు. గ‌త జూన్ నెల‌లో పాశ‌మైలారంలో ఉన్న సిగాచి కంపెనీలో ఈ ఏడాది జూన్ లో భారీ ప్ర‌మాదం సంభవించింది.ఈ ప్ర‌మాదంలో ప‌లువురి ఆన‌వాళ్లు లేకుండా పోయాయి. మృతి చెందిన వారి కుటుంబాల‌కు కోటి రుపాయాల ఆర్ధిక సహాయాన్ని అంద‌స్తామ‌ని కంపెనీ ప్ర‌మాద స‌మ‌యంలో ప్ర‌క‌టించింది. దాదాపు అరు నెల‌లుగా ఎలాంటి ఆర్ధిక స‌హాయం అందిచ‌క‌పోవ‌డంతో బాధిత కుటుంబాల నుంచి తీవ్ర వ్య‌త‌రేక‌త మొద‌లైంది. పోలీసులకు ఫిర్యాదులు ఎక్కువ కావ‌డంతో పోలీసులు దాదాపు 7 నెల‌ల అనంత‌రం సిగాచి సంస్థ సీఇ ఓ అమీత్ రాజ్ ను అరెస్లు చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. మృతుల కుటుంబాల‌కు న‌ష్ట ప‌రిహాయం విష‌యంలో ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తి రేపుతున్న అంశంగా మారింది. ప‌రిశ్ర‌మ యాజ‌మాన్యం చేతులెత్తేయ‌డంతో ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యంపై బాధితుల కుటుంబాలు భారీగా ఆశ‌లు పెట్టుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *