NewsInn

News in a Click

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజెపీలు కలిసిపోయాయి

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజెపీలు కలిసిపోయాయి

కాంగ్రెస్–బీజేపీ చీకటి స్నేహం బయటపడింది

త్వ‌ర‌లో కేసిఆర్ పాల‌మూరు ప‌ర్య‌ట‌న

నాగర్ కర్నూల్ సభలో కేటిఆర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రేవంత్ రెడ్డి ఎంత దోపిడీ చేసినా బీజేపీ మాట్లాడదని, బీజేపీ పార్టీ కాంగ్రెస్‌ని విమర్శించదని, కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీని విమర్శించరని కేటిఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగ చీకటి కలిసిపోయి దోపిడీ చేసినట్లు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో కలిసిపోయాయని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే రెండు సంవత్సరాల కాలంలో బిజెపి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు వైఫల్యాన్ని మోసాన్ని ఎప్పుడు ప్రశ్నించడం లేదని కేటీఆర్ అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బిజెపిని విమర్శించకుండా కేవలం బి ఆర్ ఎస్ పార్టీని మాత్రమే విమర్శిస్తున్నారని అన్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.నాగర్ కర్నూల్‌లో జరిగిన నూతన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు జిల్లాను మళ్లీ వలసల జిల్లాగా మార్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీ పడుతున్నారని అన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాపాడుకొని రైతన్నలకు అండగా నిలబడేందుకు, తెలంగాణ నీటి వాటాల ప్రయోజనాలను కాపాడేందుకు కేసీఆర్ మరోసారి పోరాటానికి సిద్ధమయ్యారని కేటీఆర్ వెల్లడించారు. త్వరలోనే పాలమూరుకు కేసీఆర్ రాబోతున్నారని చెప్పారు.

ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధి వస్తుందని, జిల్లా పరిషత్‌, మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్ కాగా, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్ అని తెలిపారు. కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యమని, అభ్యర్థి ఎవరైనా కారు గుర్తు మీద మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.నూతనంగా గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. భారీ ఎత్తున బీఆర్‌ఎస్ సర్పంచులు గెలవడం శుభదాయకమని అన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో 9,300 ఎకరాలపై రేవంత్ కన్ను పడిందన్నారు. ప్రభుత్వాలు పరిశ్రమలకు భూములు ఇస్తాయని, రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో తక్కువ ధరకు భూములు ఇస్తామని చెప్పారు. పరిశ్రమల కోసం ఇచ్చిన భూముల్లో ఏదైనా కట్టుకోవచ్చంటున్నడు రేవంత్ అని విమర్శించారు. రూపాయికి 30 పైసలు కడితే ఏదైనా కట్టుకోవచ్చా? అని ప్రశ్నించారు. రూ. 5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు రేవంత్ హిల్ట్ పాలసీ తెచ్చ‌రాని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *