ఫోన్ ట్యాపింగ్ ఓ డైవర్షన్ కేసు
పాలమూరు పూర్తి చేస్తే బాబుకు కోపం వస్తుంది
మీడియాతో కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
గడ్డాలు పెంచితే అందరూ గబ్బర్ సింగ్ లు కాలేరని….గడ్డం పెంచడం ఎంతో సులువు అని కానీ పాలన చేయడమే కష్టమని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీసాలు లేవని చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవి కావని రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీలకు మీసాలు లేవనే విషయాన్ని రేవంత్ ప్రస్తావించరాన్నారు. తాను ఆంధ్రాలో చదువు కోవడం తప్పన్న చందంగా రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని నేను అక్కడ చదవు కుంటే కాని తప్పు ఆంధ్రా అల్లుడిని తెచ్చుకుంటే కాదా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ లో మీడియాతో మాట్లాడిన కేటిఆర్ పలు అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదం చేసే యత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కి ఇంటెలీజెన్స్ వ్యవస్థతో సమాచారం అందుతుందని ఇది కొత్తగా ఇప్పుడే వచ్చిన వ్యవస్థ కాదన్నారు. శాంతిభద్రతల కోసం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఈ ప్రభుత్వ హాయంలో ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజమే అయితే అధికారులు ఎందుకు మీడియా సమావేశాలు పెట్టి అధికారికంగా సమాచారాన్ని బయటకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న డీజీపి కూడా అప్పుడు కీలక పదవిలో ఉన్నారని కేటిఆర్ గుర్తు చేశారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తోందో సీఎం కు అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడం లేదేమో అన్న అనుమానాలు తనకు వస్తున్నాయని చెప్పారు. సిట్ వంటి డ్రామాలతో ఎన్ని రోజులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని కేటిఆర్ ప్రశ్నించారు.

ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ అమలు చేస్తుందని ఇది ప్రజలు గమనించి ప్రజలు స్థానిక ఎన్నికల్లో తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపించారని అన్నారు. రేవంత్ అవినీతి అక్రమాలు అపినందుకే ఆయన బూతులు మాట్లాడుతున్నారని…నాపై విమర్శలు చేస్తే నేను రెస్పాండ్ కానని మా నాన్నను అంటే ఉర్కోనేది లేదన్నారు. రేవంత్ బూతులకు నేను రేస్పాండ్ అయితే చాలా మంది సీనియర్ నేతలు ఆ స్థాయికి దగజారవద్దన్న సూచనలు తనకు చేస్తున్నారని అందుకే తాను స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం 45 టీఎంసీకు అంగీరిస్తే…ఇదే రాష్ట్రానికి తీవ్ర నష్టమన్నారు. రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఎవరిచ్చారో తెలుసన్నారు. పాలమూరు ప్రాజెక్టును సీఎం రేవంత్ కావాలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే మాజీ సీఎం కేసిఆర్ కు పేరు వస్తుందని, ఇదే సమయంలో రేవంత్ పాత బాస్ చంద్రబాబు కు కోసం వస్తుందనే ప్రాజెక్టను పూర్తి చేసే ఉద్దేశ్యం సీఎం కు లేదని చెప్పారు.మఖ్యమంత్రి కృష్ణా నది ఏ బేసిన్, ఎక్కడ ఉన్నది అడిగాడు. బాక్రానంగల్ ఏ రాష్ట్రంలో ఉన్నదో కూడా తెలియని ముఖ్యమంత్రి మనకు ఉండడం దౌర్భాగ్యమన్నారు. పాలమూరు రంగారెడ్డి అడ్డుకున్న వ్యక్తి ఇవాళ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్నారన్నారు..నీటిపారుదల శాఖ పై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని కేటిఆర్ అన్నారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడు కదా దాన్ని కూడా ఏదో కార్పొరేషన్ చేయవచ్చాన్నరు.ఏం చేసిన శాస్త్రీయంగా ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకుంటారా అన్నింటికి సమాధానం చెప్పాలి దీనిపై కూడా ప్రభుత్వం సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు
తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కెసిఆర్ గారి పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఉంటుంది.
ముఖ్యమంత్రి సభలో కెసిఆర్ గారిని కలిసేంత సంస్కారం ఉంటే చాలు.ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుటుందిని కేటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణం మంచిదే.
.











Leave a Reply