(హైదరాబాద్,న్యూస్ఇన్)

శాసనసభా సమావేశాల తొలిరోజు కేసిఆర్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్బంగా అసెంబ్లీ హాల్ లో కేసిఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఈ విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పందించారు. కేసీఆర్ పై ఆ మాత్రం గౌరవం ఉంటే చాలన్న అభి ప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా కేసిఆర్ తో ఏమాట్లాడారన్న అంశంపై మీడియాకు చెప్పేందుకు నిరాకరించారు. మేము ఏమైనా మాట్లాడుకుంటాం….కేసిఆర్ సభ నుంచి ఎందుకు వెళ్లి పోయారో ముందు మీరు అడగండి అంటూ మీడియా ప్రతినిధులతో రేవంత్ వ్యాఖ్యలు చేశారు.









Leave a Reply