ఢిల్లీకి చెందిన యువతి అవివా బేగ్
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అంటూ ప్రచారంలో ఉన్న లోకసభలో ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ మేనల్లుడు రియాన్ వాద్ర ఎంగేజ్మెంట్ పూర్తయింది. ఢిల్లీకి చెందిన అవివా బేగ్ తో నిశ్చితార్థం జరిగింది. ప్రియాంక వాధ్రా కొడుకైన రియాన్ వాధ్రకు ఢిల్లీకి చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూతురు అయిన అవివాతో ఎంగేజ్మెంట్ పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ఈ కొత్త జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రియాన్, అవివా ఫోటోలతో సోషల్ మీడియా లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. మామ పెళ్లి కంటే ముందు అల్లుడి పెళ్లి అయ్యేలా ఉందని కొందరు, నేతలకు సేవలు చేసేందుకు మరో కుటుంబం రెడీ అయిందని మరి కొందరు వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోల కింద తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సమయం కీలకంగా మారి అవివా కూడా గాంధీ గా మరిపోతుందని మరి కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తం మీద రియాన్ వాధ్ర ఎంగేజ్ మెంట్ కూడా ఈ రోజు సోషల్ మీడియాల్ హాట్ హాట్ గా మారింది.










Leave a Reply