NewsInn

News in a Click

హరీష్‌ చెప్పేవన్నీ అబద్ధాలే: మంత్రి ఉత్తమ్‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సాగునీటి రంగానికి సంబంధించి రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతోందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్ర‌చారాన్ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ అబద్ధాల ప‌రంప‌ర కొన‌సాగుతోంద‌న్నారు. నిన్న మొన్నటి వ‌ర‌కు కృష్ణా జ‌లాలు అంటూ గ‌గ్గోలు పెట్టిన బీఆర్ ఎస్ ఈ రోజు మ‌రో అబ‌ద్ధ‌పు అంశాన్ని తెర‌పైకి తేవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ తెలంగాణా స‌ర్కార్ కేసులు వేసిన విష‌యాన్ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. పోలవరం–బన‌కచర్ల ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సంఖ్య WP నెం. 1258. అని వివ‌రిస్తూ….ఈ కేసు జనవరి 5వ తేదీ సోమవారం, భారత ప్రధాన న్యాయమూర్తి గారి ముందు, కోర్టు నెం. 1, ఐటెం నెం. 11గా విచారణకు లిస్ట్ అయింది.ఇది పోలవరం–బన‌కచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణాత్మకంగా, చట్టబద్ధంగా పోరాడుతున్నదానికి స్పష్టమైన నిదర్శనం అని చెప్పారు. హరీష్‌రావు మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *