
- విద్యా వైద్యానికి ప్రాధాన్యం సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఈ ఆర్ధిక సంవత్సరం నుంచి ఇందిరమ్మ జీవిత భీమా పథాకానికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ పథకంలో 1.15 కోట్ల కుటుంబాలకు అమల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కుల గణనలో భాగంగా చేసిన లెక్కల ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చ సందర్భంగా సీఏం మాట్లాడారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం లో బాకాయి ఉన్న నిధులు ప్రతి నెల చెల్లిస్తున్నామన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు సగటున ఈ పథకంలో రూ.88 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని దీన్ని మోస్తూనే ఈ పథకాన్ని 10 లక్షలకు పెంచామన్నారు. ప్రస్తుతం 727 కోట్ల రుపాయాల బకాయిల మాత్రమే ఉన్నాయని తెలిపారు.దీంట్లో ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు తక్కువగా ఉన్నాయన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో వైద్యం చేసుకునే రోగుల సంఖ్య పెరిగిందని సీఎం అన్నారు.గతంలో సీఎం ఆర్ ఎఫ్ మంజూరులో అవినీతి చోటు చేసుకోవడంతో ఇప్పుడు దాన్ని ఆన్ లైన్ విధానం అమలు చేసి ఎమ్మెల్యేలకు అధికారం కల్పించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్స కోసం వచ్చే రోగులను టీచింగ్ కాలేజీలకు పంపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణాకు ఎంతో మంది విదేశాల్లో వైద్యులుగా పనిచేస్తున్నారని, వారు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా వారి సేవలను ఇక్కడ వినియోగించేలా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలో 30 ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రిని పునఃనిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రుల పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో మరో 10 వేల బెడ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యా, వైద్యం మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
బస్సు ప్రమాదంపై సీఎం ఆరా…..





Leave a Reply