(హైదరాబాద్,న్యూస్ఇన్)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నగరంలో గంగా జమునా తెహిజీబ్ గా మత సామరస్యం వెల్లి విరుస్తుందని చెప్పే ఈ వీడియో ఆయన షేర్ చేసిన కొద్ది సేపట్లోనే వేలాది మంది వీక్షించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిపిన ఉత్సవ మూర్తుల ఊరేగింపులో నగరంలోని చార్మినార్ సమీపంలో ఈ దృష్యాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఉత్సవంలో హిందూ మహిళలతో కలిసి ముస్లిం మహిళ తమ సాంప్రదాయ బుర్ఖా ధరించి కోలాటం వేస్తుండడం అందరినీ ఆకట్టుకుంది. మీరు ఈ వీడియో చూడండి……




Leave a Reply