భూములను ఆక్రమించుకోవాలని పిలుపు
ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఏమైంది
కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారుల తరపున మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలం ఇప్పటివరకు ఇవ్వలేదని కవిత ప్రభుత్వాన్ని నిలదిశారు. ఉద్యమకారుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమణలు మొదలుపెట్టాలని కవిత ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లా ఉద్యమకారులతో కలిసి భూ పోరాటంలో ఆమె పాల్గొన్నారు.ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు తెలంగాణ ఉద్యమకారుల తరపున పోరాటంలో తాను ముందు ఉంటానన్నారు.

విలువైన భూములు ఉండే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా తమ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.ప్రభుత్వం ఆ జిల్లాలోని విలువైన భూములు అమ్ముకోవాలని చూస్తోంది. కానీ ఉద్యమకారుల పోరాటం, చెమట ద్వారానే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ద్వారా లబ్ధి పొందేందుకు వారికి ఎన్నో హామీలు ఇచ్చింది. పెన్షన్, సంక్షేమ బోర్డు, 250 గజాల జాగ ఇస్తామని మాట ఇచ్చింది. కానీ కనీసం ఉద్యమకారులను గౌరవించి వారికి శాలువాతో సన్మానం కూడా చేయలేదు.
అమరవీరుల కుటుంబాలకు ఎంతో చెప్పాం
12 వందల మంది అమరులైతే బిఆర్ఎస్ ప్రభుత్వంలో 540 మందికి మాత్రమే మేలు జరిగిందన్నారు. ఇప్పుడు ఉద్యమకారులంతా ఫోరంగా ఏర్పడి ఒక దగ్గరకు వచ్చారు. ఇక మన ఐక్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చినా హామీలకు సంబంధించి ఒక్క ప్రకటన లేదన్నారు. ఉద్యమకారుల ఫోరం ఇచ్చిన డేటా ప్రకారమే ఉద్యమకారులను గుర్తించాలని కవిత డిమాండ్ చేశారు.ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పారు.



Leave a Reply