NewsInn

News in a Click

ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో సంక్షోభం వేళ భారత రైల్వేస్ కీలక నిర్ణయం..

ప్రయాణికులకు శుభవార్త.. ఇండిగో సంక్షోభం వేళ భారత రైల్వేస్ కీలక నిర్ణయం..

దేశవ్యాప్తంగా ఇండిగోతో పాటు పలు విమానయాన సంస్థలు వరుసగా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు భారీ ఇబ్బందుల్లో పడిపోయారు. హఠాత్తుగా విమాన ప్రయాణం నిలిచిపోవడంతో, లక్షలాది మంది ప్రజలు రైల్వేలను ఏకైక ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. భారత రైల్వే అత్యవసర చర్యల పై దృష్టి పెట్టింది.డిసెంబర్ 6, 2025 నుండి అనేక రైళ్లకు అదనపు కోచ్‌లు జతచేయడంతో పాటు, అత్యధిక రద్దీ ఉన్న మార్గాల్లో ప్రత్యేక ట్రిప్పులు నడిపించాలని నిర్ణయం తీసుకుంది.

విమానాల రద్దు ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది హైద్రాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం ప్రాంతాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దక్షిణ రైల్వే మొత్తం 18 రైళ్లకు స్లీపర్ మరియు చెయిర్ కార్ కోచ్‌లను జతచేసింది. ఈ నిర్ణయం హఠాత్తుగా పెరిగిన ప్రయాణికుల ప్రభావానికి కాస్త ఇబ్బందులు లేకుండా చేయగలిగింది.

ఢిల్లీ దిశగా ప్రయాణం అత్యధికంగా ఉండటంతో, ఉత్తర రైల్వే ఎనిమిది ప్రధాన రైళ్లకు అదనపు ఏసీ, చెయిర్ కార్ కోచ్‌లను జోడించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు ఈ చర్యతో పెద్ద ఉపశమనం పొందుతున్నారు. ఇదే సమయంలో, విమానాల రద్దుతో ఢిల్లీ–ముంబై మార్గం తీవ్ర ప్రభావితమవడంతో, పశ్చిమ రైల్వే నాలుగు రైళ్లలో 3AC, 2AC కోచ్‌లను పెంచింది. పాట్నా–ఢిల్లీ మార్గంలో భారీ రద్దీ నేపథ్యంలో తూర్పు మధ్య రైల్వే డిసెంబర్ 6 నుంచి 10 వరకు రాజేంద్రనగర్–న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఐదు అదనపు ట్రిప్పులను నడపాలని నిర్ణయించింది.

ఒడిశా–ఢిల్లీ రూట్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం తూర్పు కోస్ట్ రైల్వే 20817, 20811, 20823 రైళ్లకు 2AC కోచ్‌లను ఐదు ప్రత్యేక ట్రిప్పుల్లో జత చేసింది. అలాగే తూర్పు రైల్వే డిసెంబర్ 7, 8 తేదీలలో మూడు ముఖ్య రైళ్లకు స్లీపర్ కోచ్‌లను జోడించింది. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణికుల కోసం ఈశాన్య సరిహద్దు రైల్వే డిసెంబర్ 6 నుండి 13 వరకు ఎనిమిది అదనపు ట్రిప్పులు నడుపుతూ 3AC, స్లీపర్ సీట్లను పెంచింది.

వీటిలో గోరఖ్‌పూర్–ఆనంద్ విహార్ స్పెషల్, న్యూఢిల్లీ–ముంబై సెంట్రల్ స్పెషల్, న్యూఢిల్లీ–శ్రీనగర్ వందే భారత్ స్పెషల్, హజ్రత్ నిజాముద్దీన్–తిరువనంతపురం స్పెషల్ ఉన్నాయి. విమానాల రద్దుతో ప్రధాన నగరాలు—ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పాట్నా—లో రైలు టిక్కెట్ల డిమాండ్ అకస్మికంగా పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *