NewsInn

News in a Click

ఔదార్యంలో ఆయ‌న రూటే…..స‌ప‌రేటు….

ఔదార్యంలో ఆయ‌న రూటే…..స‌ప‌రేటు….

కొత్త సంవ‌త్స‌రం పేద‌ల‌కు భారీగా ఆర్ధిక సహాయం

స‌తీమ‌ణికి రాజ‌కీయ పాఠాలు

(హైద‌రాబాద్, న్యూస్ఇన్)

ఎంతో మంది రాజ‌కీయ నేత‌ల‌ను ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో చూస్తుంటాం. ఒక్కొక్క‌రు వ్య‌వ‌హ‌రించే తీరు ఒక్కో ర‌కంగా ఉంటుంది. అవ‌సరానికి అనుగుణంగా రాజ‌కీయ నేత‌లు నిర్ణ‌యాలు తీసుకుంటారు. కానీ ఆర్ధికంగా నేరుగా స‌హాయం చేసేందుకు అతి కొద్ది మంది నేత‌లు మాత్ర‌మే నిర్ణ‌యాలు తీసుకుంటారు . కొంత మంది నేత‌ల‌కు అపార సంప‌ద ఉన్నా….. అవ‌స‌రానికి ఆర్ధిక స‌హాయం చేసేందుకు అనే పేరు కూడా ఉంటుంది. మ‌రికొంత మంది నేత‌లు రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉన్నా… ఆదుకోవ‌డం కోసం ఎన్నో నిబంధ‌న‌లు అమ‌లు చేస్తూ ఉంటారు.
ఆకుటుంబం మ‌నకు పార్టీకి ఎంత వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతారో అంచ‌నా వేసి స‌హాయం చేసేందుకు నేత‌లు నిర్ణ‌యం తీసుకుంటారు. అయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం….ఆప‌ద‌లో ఎవ‌రున్నా…..నేనున్నా అంటూ అంద‌రికంటే ముందుగానే అపన్న‌ హ‌స్తం అందిచేందుకు రెడీ అవుతార‌న్న టాక్ మ‌నం వింటుంటూం….. దీర్ఘ కాలిక రోగాల బారిన ప‌డే కొంత మంది పేద కుటుంబాలు ఆర్ధికంగా మ‌రింత ఇబ్బందుల్లో ప‌డుతుంటారు. దీంతో ఆర్ధిక ప‌రిస్తితులు పూర్తిగా తారుమారై కొన్ని పేద కుటుంబాల‌కు త‌మ‌కు వ‌చ్చిన రోగాల చికిత్స కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి కుటుంబాల‌న్నీ జ‌గ్గారెడ్డి స‌హాయ స‌హ‌కారాల గురించి తెలిసిన వారెవ‌రైనా ఆశ‌లు పెంచుకుంటారు. త‌న ఆర్ధిక ప‌రిస్థితులు ఎలా ఉన్నా….. నిజంగా అత్య‌వ‌స‌రం వైద్య స‌హాయం చేయాలంటే మాత్రం జ‌గ‌న్న వెనుక‌డుగు వేయర‌న్న ఆయ‌న అనుచ‌రులు ధీమాగా చెబుతుంటారు. ఆర్ధిక ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌ని పేద‌ రోగుల ఖ‌రీదైన వైద్యానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆర్ధిక స‌హాయాన్ని అందించేందుకు ఆయ‌న అత్యంత ప్రాధాన్య‌త నిస్తారని మ‌రోసారి ఈ రోజు రుజువైంది.

ప్ర‌స్తుతం వైద్యం అత్యంత ఖ‌రీదుగా మార‌డంతో రోగులు ఎదుర్కొంటున్న వైద్య చికిత్స ల కోసం త‌న దృష్టికి వ‌చ్చిన పేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఆయ‌న గ‌తంలో ఎన్నో పేద కుటుంబాల‌కు ఆర్ధిక స‌హాయం అందించారు. గ‌త ఏడాది కూత‌రు నిశ్చితార్థం రోజు కూడా ఓ క్యాన్సర్ పేషంట్ చికిత్స కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్న స‌మాచారంతో ఊహించ‌ని విధంగా ఆ పేద కుటుంబం ఇంటికి స్వ‌యంగా జ‌గ్గా రెడ్డి వెళ్లి ఆర్ధిక స‌హాయం అంద‌చేశారు. ఈ రోజు కొత్త సంవ‌త్స‌రం కావ‌డంతో ప‌లు పేద రోగుల కుటుంబాలు ఆర్ధిక స‌హాయంకోసం ఎదురు చూస్తుండ‌డంతో వారంద‌రినీ పిలిచి త‌న స‌తీమ‌ణి నిర్మలా జ‌గ్గారెడ్డి తో క‌లిసి వైద్య స‌హాయం కోసం వ్య‌క్తిగ‌తంగా భారీగా ఆర్ధిక స‌హాయం చేశారు.

ఒక్కో కుటుంబానికి 2 ల‌క్ష‌ల రుపాయాల‌కు త‌గ్గ‌కుండా ఆర్ధిక స‌హాయం అందించి వైద్యం కోసం అవ‌స‌ర‌మైతే త‌న‌ను మ‌ళ్లీ సంప్ర‌దించాల‌ని ఆ కుటుంబాల‌కు భరోసా క‌ల్పించారు. దుర‌ల‌వాట్ల‌తో రోగాల బారిన ప‌డిన వారిని ఓ పెద్ద‌న్నలా మంద‌లిస్తూ దుర‌ల‌వాట్ల కార‌ణంగా కుటుంబం రోడ్డున ప‌డుతుంద‌ని హెచ్చ‌రిక‌లు చేస్తూ వారిని ఆదుకునేందుకు కూడా వెనుక‌డుగు వేయ‌డం లేదు. మొత్తం మీద కొత్త సంవ‌త్స‌రం రోజు స‌తీమ‌ణి నిర్మలా జ‌గ్గా రెడ్డితో క‌లిసి జ‌గ్గ‌న్న పేద రోగుల‌కు భారీగా ఆర్ధిక స‌హాయం చేయ‌డం ఆ కుటుంబాల్లో కొత్త అనందాన్ని ఇచ్చింది.

స‌తీమ‌ణికి రాజ‌కీయ పాఠాలు….

తాను చేసే ఈ కార్య‌క్ర‌మాల‌కు కుటుంబ స‌భ్యుల‌ను భాగ‌స్వామ్యం చేస్తున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి నిర్మలా జ‌గ్గారెడ్డిని త‌న‌తో పాటు సేవ‌కార్య‌క్ర‌మాల్లో ముమ్మ‌రంగా పాల్గొనేలా చూస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగే అన్ని కార్య‌క్ర‌మాల్లో కూడా నిర్మలా జ‌గ్గా రెడ్డి క్రియాశీల‌కంగా మారుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని జ‌గ్గా రెడ్డి అప్పుడ‌ప్ప‌డు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. నిర్మలా జ‌గ్గారెడ్డి యాక్టివ్ పొలిటిక్స్ లో గ‌తం కంటే చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో స‌తీమ‌ణికి రాజ‌కీయ పాఠాలు నేర్పుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *