NewsInn

News in a Click

టీఎంసీల‌ అబద్దాలు… క్యూసెక్కుల అజ్ఙానం సీఏం ది

టీఎంసీల‌ అబద్దాలు… క్యూసెక్కుల అజ్ఙానం సీఏం ది

రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై హ‌రీష్ చుర‌క‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కృష్ణా జలాల్లో తెలంగాణా కు రావాల్సిన నీటి వాటాల విష‌యంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఎవ‌రి వాద‌న‌ను వారు వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల కోసం ఏర్పాటు చేసుకున్న అవ‌గాహ‌న స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నీటి ప్ర‌వాహం మాదిరిగానే అబ‌ద్దాల ప్ర‌వాహాన్ని పారించార‌ని మంత్రి హ‌రీష్ రావ్ ఆరోపించారు. సీఎం నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌న్నారు. ఆయ‌న ప్ర‌సంగం చూస్తుంటే టీఎంసీల అబ‌ద్దాలు, క్యూసెక్కుల అజ్ఙానం బ‌య‌ట‌ప‌డింద‌ని ఎద్దేవ చేశారు. అబ‌ద్దాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా రేవంత్ త‌న‌ను తాను నిరూపించుకున్నార‌ని ఆరోపించారు. అబద్దాలకు కూడా ఆస్కార్ అవార్డు ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బచావత్ ట్రిబ్యునల్ కు, బ్రిజేష్ ట్రిబ్యునల్ కు తేడా తెలియదని ఈ రోజు చేసిన వ్యాఖ్య‌ల‌తో వెల్ల‌డైంద‌న్నారు. . కేసీఆర్ ను , నన్ను ఉరి తీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూ అనాగరిక వ్యాఖ్యలు చేస్తూ మరోవైపు మర్యాద పాటిస్తానని సుద్దపూసలా రేవంత్ రెడ్డి న‌టించే య‌త్నేం చేస్తున్నార‌ని హ‌రీష్ రావ్ ఆరోపించారు. నీటి పంపిణీలో విష‌యంలో నిజాలను దాచి సీఎం త‌ప్పుడు ప్ర‌చారం చేసేందుకు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం భావ్యం కాద‌న్నారు. తుంగభద్ర అనే నది ద్వారా 450-600 టిఎంసీలు ప్రతి సంవత్సరం వ‌స్తాయ‌న్న విష‌యం కూడా సీఎంకు తెలియ‌ద‌న్నారు.పాలమూరు ప్రాజెక్టుకు 90 టీఎంసీలకు డీపీఆర్ పంపి 7 అనుమతులు తెచ్చింది బీఆర్ఎస్, కేసీఆర్ అనే గుర్తు చేసుకోవాల‌న్న‌రు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క అనుమ‌తి కూడా లేక‌పోవ‌డం…దీనికి తోడు డీపిఆర్ కూడా వెన‌క్కి తెచ్చేంత స‌మ‌ర్ధ‌వంత‌మైన ప్ర‌భుత్వం అని హరీష్ రావ్ రేవంత్ కు చురుక‌లు అంటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *