NewsInn

News in a Click

గ‌త‌ ప్ర‌భుత్వంపై మ‌రో విచార‌ణ జ‌రుగుతోంది

సీఎం రేవంత్ రెడ్డి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కృష్ణా జ‌లాల వాటాల పంపిణీపై జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌తో కృష్ణా జ‌లాల్లో వాటాను తెలంగాణా కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కేసిఆర్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలే తెలంగాణాకు శాపంగా మారాయని ఆరోపించారు. జూరాల నుంచి పాల‌మూరు రంగారెడ్డి సోర్స్ ను శ్రీశైలం కు మార్చేందుకు గ‌త ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గ ఆమోదం తీసుకోలేద‌ని రేవంత్ వెల్ల‌డించారు.

ఈ విష‌యం బ‌య‌ట ప‌డుతుంద‌ని అసెంబ్లీకి కేసిఆర్ రావ‌డం లేద‌న్నారు. దీనిపై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రుపుతుంద‌ని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు బ‌న‌క చ‌ర్ల ప్రాజెక్ట అంశాన్ని తెర‌పైకి తెస్తున్నార‌న్నారు. మాజీ సీఎం కేసిఆర్ అసెంబ్లీకి రావాలి…త‌న అనుభ‌వాన్ని స‌భ‌లో పంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఆదిత్య నాథ్ దాస్ తెలంగాణ ప్రాజెక్ట్ ల పైన 10 ఏళ్ళు పని చేశారని, అన్ని ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న ఉంద‌న్నారు. ఆయ‌న నాకు బంధువు కాద‌ని సీఎం వ్యాఖ్యానించారు. తమ దొంగతనం బయట పడుతుందనే ఆదిత్య నాథ్ దాస్ పైన హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *