ప్రముఖ నగరాలు రివర్ పక్కనే ఉన్నాయి
మూసీ కంటే ప్రతిపక్ష పార్టీ నేతలే కంపు
సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ముసీ సుందరీకరణకు వెనుకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం మూసీ అభివృద్ధి గురించి ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. మూసీని అభివృద్ధి చేసేందుకు లండన్ థేమ్స్ రివర్, న్యూయార్క్ జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ లాంటి దేశాలను పర్యటించామని సీఎం అన్నారు. గుజరాత్ లో సబర్మతీ నది ప్రక్షాళన సమయంలో 60 వేల కుటుంబాలను తరలించారన్న విషయాన్ని నేతలు గుర్తించాలని సీఎం వ్యాఖ్యలు చేశారు. మూసీ కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని,కంపెనీల కలుషితాల నుంచి జంతువుల కళేబరాల వరకు మూసీలో కలుస్తున్నాయిమూసీ పరీవాహక ప్రాంత మహిళలు గర్భం దాల్చలేకపోతున్నారని వైద్యులు చెబుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందన్నారు. కన్సల్టెన్సీలను అపాయింట్ చేసుకుని మూసీ ప్రక్షాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పామన్నారు. బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ రెండు నదులు కలిసే చోట V షేప్ లో అభివృద్ధి జరుపాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి జలాలను తరలించి మూసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.మార్చి మార్చి 31 లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు వేసి అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మూసీ అబివృద్ధి కోసం 4 వేల కోట్ల రుణం అందించేందుకు బాంకు అంగీకరించిందన్నారు.పాతబస్తీని మేం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

అందరి అభిప్రాయాలు తీసుకుంటాం….
హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో కూడా కొంత మంది అప్పటి ప్రభుత్వంపై రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటూ ఆరోపణలు చేశారని, ఇప్పుడు తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఈ ఆరోపణలు పట్టించుకోనని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళన చేయాలని వాళ్ల బీఆరెస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మెరుగైన వసతులు కల్పిస్తామంటే వాళ్లు అలాగే ఉండాలన్నట్లుగా విపక్షం ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. మంచిరేవుల దగ్గర మూసీ పరివాహకంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నామని సీఎం వెల్లడించారు. మూసీ పరివాహకంలో గురుద్వార్ , మసీదు, చర్చి లను నిర్మించి మత సామరస్యాన్ని చాటబోతున్నాం డీపీఆర్ సిద్దమయ్యాక అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం




Leave a Reply