పీకే చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు
రూ.35.19 కోట్ల నిధులతో సత్రం
(హైదరాబాద్ న్యూస్ఇన్)
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకోనున్నారు. టీటీడి మంజూరు చేసిన నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. . కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని పవన్ కళ్యాణ్ భక్తితో కొలుస్తారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టి.టి.డి. సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనలకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీటీడీ కూడా ఈ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం జరిగే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు సహా పలువురు నేతలు పాల్గొననున్నారు

జనసేన కార్యకర్తలతో సమావేశం…..
ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశంఏర్పాటు చేశారు.



Leave a Reply