చుట్టుముడుతున్న వివాదాలు
ఆర్ధిక సమస్యలు బేఖాతర్
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
గ్రేటర్ హైదరాబాద్తీ స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. ఏ అభివృద్ధి పనులు చేపట్టాలన్నా ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పే గ్రేటర్ అధికారులకు కార్పోరేటర్ల టూర్ వ్యవహారం కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిని విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ప్రస్తుత పాలక మండలి లో కార్పోరేటర్లు ఇతర రాష్ట్రాలకు సిద్ధం అవుతుండడం వివాదాస్పదంగా మారుతోంది. మరికొద్ది రోజుల్లో ప్రస్తుత పాలక మండలి సమయం గడువు తీరనుంది. ఈ సమయంలో స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. స్టాండింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో కోటి రుపాయలకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి పై ఆర్ధిక భారం పడనున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక్కో కార్పోరేటర్ కు లక్ష రుపాయలకు పైగా ఖర్చు అవుతుందిన అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 150 మంది కార్పోరేటర్లు ఉన్నాయి.

మెజార్టీ కార్పోరేటర్లు బీఆర్ ఎస్ పార్టీ నుంచి ఉన్నా……. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీ లోకి కొంత మంది కార్పోరేటర్లు చేరారు. బీఆర్ ఎస్ తరువాత అత్యధిక సంఖ్యలో బీజెపి,ఎంఐఎం కార్పోరేటర్లు ఉన్నారు. కార్పోరేటర్లందరినీ స్టడీ టూర్ పేరుతో అహ్మదాబాద్, చంఢీఘడ్ నగరాల్లో పర్యటించేందుకు అనుగుణంగా గ్రేటర్ పాలక మండలి ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరో నెల రోజుల్లో పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కార్పోరేటర్లు స్టడీటూర్ కు వెళ్లి వచ్చి నగరంలో ఏ కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ప్రస్తుతం గ్రేటర్ పరిధి మొత్తం మారిపోనుంది. 300 మంది కార్పోరేటర్లు గ్రేటర్ పరిధిలోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కార్పోరేటర్ల రాజకీయ భవిష్యత్తు కూడా ఏమిటన్నది ఆసక్తి రేపుతోంది. కార్పోరేటర్లు అనివార్య కారణాలతో లేదంటే రాజకీయ కారణాలతో స్టడీ టూర్ కు వెళ్లలేకపోతే వారికి భారీగా నజరానా ఇచ్చేలా కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అభివృద్ధికి నిధుల లేమి కారణాన్ని చూపే అధికారులు స్టడీ టూర్లకు నిధులు ఎలా కేటాయిస్తారని ఫోరం ఫర్ గుడ్ గవర్నర్స్ మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.



Leave a Reply