విద్యార్థులకు గాయాలు
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ఖమ్మం జిల్లాలో ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సులో విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రజ్యాణిస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదం జరిగిన సమయంలో 107 మంది విద్యార్థులున్నారు..ప్రమాదం జరుగడంతో 20 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారుల్లో ఈ ప్రమాదం జరిగింది. వేంసూరు మండలం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన వివేకానంద పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది.డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థుల ఆరోపిస్తున్నారు.

అయితే కాలువలో నీళ్లు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. ప్రమాద కారణాలపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిమితికి మించి స్కూల్ బస్సులో విద్యార్థులను తీసుకెళ్లడం పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్ లో జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.




Leave a Reply