అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం
(హైదరాబాద్, న్యూస్ఇన్)
కృష్ణా జలాల్లో తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు నీటి వాటా కోసం రాష్ట్ర విభజన సమయం నుంచి ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి.తాజాగా మరోసారి తెలంగాణాలో కృష్ణా గోదావరి జలాలపై రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మీదంటే మీది తప్పు అంటూ విమర్శలు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీలదే తప్పుంటూ బీజెపి వ్యాఖ్యలు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కృష్ణా జలాల్లో వాటా కోసం బీఆర్ ఎస్ ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు ప్రకటన చేసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం కృష్ణా బేసిన్ పరిధిలో ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తూనే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై నిరసనగా భారీ సభలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. నదీ జలాల్లో నీటి వాట కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య తరచూ వివాదం తలెత్తుతోంది.

ఇరు రాష్ట్రాల్లో నీటి వాటాను తేల్చేందుకు కేంద్రం కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తూ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. ఆరు నెలల క్రితం జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వాటిని చర్చించి, సాంకేతికతంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని APEX కౌన్సిల్ నిర్ణయించింది.

ఇందుకోసం ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. డిసెంబర్ 23, 2025 నాడు తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో ఇవాళ (శుక్రవారం) కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది. ఈ కమిటీకి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి.. జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. వీరితోపాటుగా.. కృష్ణానది యాజమాన్య బోర్డు (KRMB) హైదరాబాద్ చైర్మన్, గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) చీఫ్ ఇంజనీర్, CWC చీఫ్ ఇంజనీర్ కూడా సభ్యులుగా ఉంటారు
రేవంత్ సర్కార్ విఫలం…..

కమిటీ నియామకంలో కూడా ముఖ్యమంత్రి ప్రదర్శించిన అలసత్వంతో తెలంగాణా అధికారులకు సముచిత స్థానం దక్కలేదని మాజీ మంత్రిహరీష్ రావ్ ఆరోపించారు. ఏపీకి ప్రాధాన్యత నిచ్చే విధంగా ఈ కమిటీ నియామకం జరిగిందన్నారు.ఏపీ తరపున ఇద్దరు ఐఎఎస్ అధికారులు, ఇద్దరు ఇంజనీర్లు ఉంటే తెలంగాణా తరపున ఐఎఎస్ అధికారులతో పాటు ఒకే ఇంజనీర్ ఉన్నారని హరీష్ రావ్ అన్నారు. నల్లమల సాగర్ టెండర్ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం 11 డిసెంబర్ 2025 చివరి తేదీ తో టెండర్ వేస్తే టెండర్ చివరి తేదీ అయిపోయాక 16 డిసెంబర్ 2025 నాడు సుప్రీం కోర్టు కు వెళ్లడమంటే రేవంత్ సర్కార్ నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలపడానికే అని స్పష్టమైందని హరీష్ ఆరోపించారు. టెండర్ ప్రక్రియ ఖరారవ్వడమే కాకుండా ఐ ఐ సి టెక్నాలజి ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కు టెండర్ ఖరారు అయ్యేది కాదన్నారు.



Leave a Reply