(హైదరాబాద్,న్యూస్ఇన్)

పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా గ్రామీణప్రాంతాలకు ఐటి పరిశ్రమలు విస్తరించాల్సిన అవసరం ఉందని శాసనమండలి సభ్యుడు దాసోజు శ్రవణ్ తన అభిప్రాయాన్నివ్యక్తంచేశారు. గతంలో
ఐటీ పరిశ్రమలో పనిచేసిన అనుభవాలతో ఈ విషయాలనుచెబుతున్నానని మండలిలో శ్రవణ్ గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఐటీ రంగం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని పేర్కొన్న ఆయన, ఈ పరిశ్రమ కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరించేలా వాతావరణాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.గ్రామాల్లో కూడా ఐటీ పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని సూచించారు. రూరల్ ఏరియాల్లో ఐటీ రంగం పెరిగితే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా వలసలు కూడా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఐటికి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దాసోజు శ్రవణ్ కోరారు.


Leave a Reply