పిచ్చోడి చేతికి అధికారం అందింది
బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద
(హైదరాబాద్,న్యూస్ఇన్)

రేవంత్ రెడ్డికి అధికారం రావడంతో పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంతుచిక్కడం లేదని బీఆర్ ఎస్ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. అనుభవ రాహిత్యంతో ఇష్టాను సారంగా వ్యవహరించడం ప్రజలకు నష్టం చేస్తుందన్నారు. ప్రజలమనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్ విభజనపై అన్నిరాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా సీఎం పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గ్రేటర్ విభజనపై నిరసన తెలిపారని అన్నారు. కనీసం గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి సమావేశంలో కూడా విభజనపై సమగ్రంగా చర్చించలేదన్నారు. హైదరాబాద్ మహ నగర విభజన బిల్లును దొంగచాటుగా అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆరోపించారు.పరిపాలన సాలభ్యం కోసం కేసీఆర్ హయాంలో కొత్త జిల్లాలు, మహానగర సంస్థలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజనులు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. విభజనపై త్వరలో గ్రేటర్ లో ఆందోళనలు చేస్తామని వివేక్ ప్రకటించారు. సీఎం కు కలెక్షన్ల మీద ఉన్న ధ్యాస దేని మీద లేదని విమర్శించారు. సీఎం కు ఉదయం 11వరకు ఇన్ కమింగ్… ఆ తర్వాత ఔట్ గోయింగ్.. సాయంత్రం మిగిలినవి కౌంటింగ్ తప్ప ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు.


Leave a Reply