
(హైదరాబాద్,న్యూస్ఇన్)
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి మత్తులో పోలీసులకు పట్టుబడ్డారు. నానక్ రాం గూడలో ఈగల్ టీం జరిపిన దాడులో సుధీర్ రెడ్డి పట్టుబడడం సంచలనం రేపుతోంది. గంజాయి తీసుకుంటున్న సమయంలోనే ఈగల్ టీం దాడి చేసి సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన టెస్టులో పాజిటివ్ గా ఖరారు అయింది.గతంలో కూడా రెండు సార్లు డ్రగ్స్ కేసులో పోలీసులకు సుధీర్ పట్టుబడ్డారు. మూడోసారి పట్టు బడడంతో ఆయనను డీ అడిక్షన్ సెంటర్ కు పోలీసులు తరలించారు.


Leave a Reply