NewsInn

News in a Click

పీపీటీ ఇప్పుడు….. బీఆర్ఎస్ వంతు..!

పీపీటీ ఇప్పుడు….. బీఆర్ఎస్ వంతు..!

ప్రాజెక్టుల గురించి వివ‌రించ‌నున్న బీఆర్ఎస్

జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్పాట్లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

శాస‌న‌స‌భా స‌మావేశాల సంద‌ర్బంగా అధికార పార్టీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చ గ‌త ప్ర‌భుత్వ వైఫ‌ల్యం కార‌ణంగానే రాష్ట్రంలో నీటి వాటాల్లో అన్యాయం జ‌రుగుతోందని ఆరోపించింది. 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాల‌నే అస‌లు స‌మ‌స్య‌కు కార‌ణ‌మ‌ని పేర్కొంది. మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్లో పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో పాలు కాళేశ్వ‌రం ప్రాజెక్టుల తీరును త‌ప్పు బ‌ట్టారు. ఈ రెండు ప్రాజెక్టుల ఇన్ టేక్ మార్చ‌డ‌మే బీఆర్ ఎస్ చేసిన ఘోర త‌ప్పిందంన్నారు. తద్వారా ఇరిగేష‌న్ పూర్తిగా దెబ్బ‌తింద‌న్నారు.దీనికి తోడు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌ర్చ సంద‌ర్బంగా ప్ర‌సంగిస్తూ బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. అంత‌కు ముందు రోజేఊ బీఆర్ ఎస్ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

స‌భ‌లో అధికార పార్టీకి పీపీటికి అవ‌కాశం ఇస్తే త‌మ‌కు కూడా అవ‌కాశం ఇవ్వాల‌ని బీఆర్ ఎస్ డిమాండ్ చేసినా….అధికార ప‌క్షం స్పందించ‌లేదు. దీంతో ఆదివారం తెలంగాణా భ‌వ‌న్ లో బీఆర్ ఎస్ పార్టీ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నుంది. పాల‌మూరు, కాళేశ్వ‌రం ప‌థ‌కాల‌పై మాజీ మంత్రి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీష్ రావ్ తెలంగాణా భ‌వ‌న్లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చేయ‌నున్నారు. మాజీ మంత్రి ఇస్తున్న ఈ పీపీటీని కార్య‌క‌ర్త‌ల‌కు అంద‌రు చూసేలా బీఆర్ ఎస్ ఏర్పాట్లు చేసింది. జిల్లాల కార్యాలాయ‌ల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలో ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు ఈ పీపీటీని వీక్షించేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల‌ని పార్టీ సూచించింది. క్షేత్ర స్థాయి కార్య‌క‌ర్త‌ల‌కు ఈ రెండు కీల‌క ప్రాజెక్టుల‌పై హ‌రీష్ రావ్ పీపీటీ ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టే విధంగా బీఆర్ ఎస్ దృష్టి సారించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *