NewsInn

News in a Click

హైద‌రాబాద్ లో డ్రైవింగా…. భ‌యం వేస్తోంది

అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ ఒవైసీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రోజురోజుకు విస్త‌రిస్తున్న హైద‌రాబాద్ మ‌హానగ‌రంలో డ్రైవింగ్ చేయాలంటేనే భ‌యం వేస్తోందని ఎంఐఎం ప‌క్ష నేత అక్బ‌రుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తన అనుభ‌వాన్ని స్వ‌యంగా వెల్ల‌డించడంతో అధికార ప‌క్షం ఈ వ్య‌వ‌హారంపై స‌మాధానం కూడా ఇవ్వ‌ని పరిస్తితిని అక్బ‌రుద్దీన్ క‌ల్పించారు. చాలా ఏళ్ల త‌రువాత త‌న డ్రైవ‌ర్ లేకుంటే రెండు రోజుల పాటు హైద‌రాబాద్ లో కార్ డ్రైవింగ్ చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని ప‌రిస్తితిని వివ‌రించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ర‌వ‌ణా శాఖాధికారులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అంతు చిక్క‌డం లేద‌న్నారు. కారు న‌డిపిస్తుంటే ఒక్కొక్క‌రు ఒక్కో ప‌క్క నుంచి వ‌స్తుండ‌డంతో ఈ అనుభ‌వం కొత్త పాఠాలు నేర్పించింద‌న్నారు. ర‌వాణా శాఖాధికారులు వారికి లైస‌న్సులు ఎలా మంజూరు చేస్తున్నార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఇక ట్రాఫిక్ పోలీసులుమాత్రం పోలీసు శాఖ‌కు ఆదాయం తెచ్చి పెట్టే విధంగా త‌మ సెల్ ఫోన్ల‌తో పోటోలు తీయ‌డంపైనే దృష్టి సారిస్తున్నార‌న్నారు. ప్ర‌భుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌రో కీల‌క స‌మ‌స్య‌ను అసెంబ్లీలో అక్బ‌ర్ ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చారు. న‌గ‌రంలో పావురాల కోసం వేస్తున్న తృణ ధాన్యాల‌తో ఇబ్బందులు ఎదురౌతున్నాయ‌న్నారు. తాను ఇప్ప‌టి వ‌ర‌కు ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను చూడ‌లేద‌న్నారు. న‌గ‌రంలో ఎక్క‌డ చూసినా….పావుల‌కు దాణా వేయ‌డం ఎక్కువైంద‌న్నారు. పావురాల‌తో ఊపిరి తిత్తుల స‌మ‌స్య‌లు తలెత్తి ఊపిరి తిత్తులు ప‌నిచేయ‌కుండా పోయే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చరించారు. ప్ర‌భుత్వం దీని కోసం ప్ర‌త్యేకంగా ఓ ప్రాంతాన్ని కేటాయించాల‌ని లేని ప‌క్షంలో ఎవ‌రి ఇళ్ల‌పై వాళ్లు పావురాల‌కు థాణా వేసుకోవాల‌న్నారు. ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని సూచించారు.

అక్బ‌రుద్దీన్ అనుభ‌వం ఆయ‌న మాట‌ల్లోనే వినండి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *