NewsInn

News in a Click

రేవంత్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

రేవంత్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

అసెంబ్లీలో అన్నీ అబ‌ద్ధాలే చెప్పారు.

రేవంత్ చెవిలో చెబితే చంద‌బాబు విన్నారా !

ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి

మాజీ మంత్రి హ‌రీష్ రావ్

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌)

సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో అసెంబ్లీలో అన్నీ అబ‌ద్దాలు చెప్పి సీఏం రేవంత్ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావ్ అన్నారు. సాగునీటి రంగంలో జ‌రుగుతున్న అన్యాయన్ని ఎండ‌గ‌డుతున్న త‌మ‌పై అడ్డ‌గోలు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. అసెంబ్లీలో మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, సీఎం లు శ‌నివారం చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తి అంశానికి హ‌రీష్ ఈ సంద‌ర్బంగా స‌మాధానం ఇచ్చారు. త‌మ ప్ర‌భుత్వం తెలంగాణా ప్ర‌జ‌ల‌కు సాగునీటి విష‌యంలో అన్యాయం జ‌రుగ‌రాద‌న్న ల‌క్ష్యంగా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించింద‌ని, అయితే కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతోంద‌ని హ‌రీష్ ఆరోపించారు. తెలంగాణాకు కాంగ్రెస్ ద్రోహం చేస్తూనే ఉంద‌న్నారు. అసెంబ్లీలో ఉత్త‌మ్ క‌ట్టు క‌థ‌లు, రేవంత్ రెడ్డి పిట్ట క‌థ‌లే చెప్పార‌న్నారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు శాస‌న‌స‌భ‌లో ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌న్నారు.

పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో 11వ షెడ్యూల్ లో పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పెట్ట‌లేద‌ని హ‌రీష్ ప్ర‌శ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో నిపుణుల స‌హ‌కారంతో ప్రాజెక్టుల‌కు రూప‌క‌ల్ప‌న చేశార‌ని హ‌రీష్ రావ్ చెప్పారు.రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారన్నారు…రూ.100-200 కోట్లు ఖర్చు పెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా ఈ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌న్నారు. మా ప్ర‌భుత్వ హాయంలో మొత్తం 17 ల‌క్ష‌ల ఎక‌రాల‌ను కొత్త‌గా ఆయ‌క‌ట్టు ప‌రిధిలోకి తెచ్చామ‌ని చెప్పారు. గోదావరి నదిలో నిజాం కాలంలో మనకు దక్కింది 252 టీఎంసీలు60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో..గోదావరి నదిపై ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎంసీలుకేసీఆర్ ప్రభుత్వం గోదావరినదిపై 383 టీఎంసీలకు హక్కులు సాధించిందని హరీష్‌రావు వెల్ల‌డించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 11 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పంపి 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించాంమ‌న్నారు. సమ్మక్కసాగర్ ప్రాజెక్టు మాత్ర‌మే పెండింగ్ లో ఉంద‌న్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క డీపీఆర్‌ పంపలేదు, ఒక్క ప్రాజెక్టుకు క్లియ‌రెన్స్ రాలేద‌ని హ‌రీష్ రావ్ చెప్పారు. శాస‌న‌స‌భా సాక్షిగా అబద్దాలు చెప్పినందుకు సీఎం రాజీనామా చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికరజలాలు కేటాయించకపోవడం వల్లే. తెలంగాణకు అన్యాయం జరిగింద‌న్నారు.కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పెద్దవాగు కొట్టుకుపోయింది..వ‌ట్టెం మునిగిపోయింది, SLBC కుప్పకూలింది క‌నీసం కాంగ్రెస్ కనీసం శవాలను కూడా బయటకు తీయలేద‌ని హ‌రీష్ రావ్ అన్నారు.

కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల‌కు నీరంద‌దు…

భీమాలో 17 టీఎంసీ నీళ్లుంటే….అక్క‌డి నుంచే కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని మొద‌లు పెట్టేందుకు సీఏం నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఇది త‌ప్పిద‌మే అన్నారు. కృష్ణాలో నీళ్లుంటేనే భీమాకు వ‌స్తాయి….భీమాలో నీళ్లుంటేనే కోడంగ‌ల్ కు నీళ్లు అందుతాయి. కృష్ణా న‌దిజ‌లాల‌పైనే స్ప‌ష్ట‌త లేకుండా ఈ ప‌థ‌కంతో తాను ప్రాతినిథ్యం వ‌హించే కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి నీళ్లు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. దీంతో ఈ ప‌థ‌కంలో సాగునీరు అందే అవ‌కాశం లేద‌న్న అభిప్రాయాన్ని హ‌రీష్ రావ్ వ్య‌క్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఏపీ స్పందించింది…..

రేవంత్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఏపీ ప్రభుత్వం ప్ర‌కంటించింద.రేవంత్‌రెడ్డి మాకు చెవిలో చెప్పలేదు.. మేం ఆపలేదుఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు..బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చిందని వెల్ల‌డించారు.ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ రేవంత్‌రెడ్డి అంటూ నిల‌దీశారు. రాష్ట్ర ప్రజలు, సభను తప్పుదోవ పట్టించిన..రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జ‌లాల విష‌యంలో ప్ర‌భుత్వ తీరును ప్ర‌జాక్షేత్రంలో ఎండ‌గ‌డుతామ‌ని హ‌రీష్ రావ్ చెప్పారు.త‌మ‌కు అధికారం కంటే తెలంగాణా ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *