ఏపీలో బాబును టార్గెట్ చేస్తున్న వైసీపీ
రేవంత్ వ్యాఖ్యలు తప్పంటున్న టీడీపి
తెలుగు రాష్ట్రాల్లో రాజుకుంటున్న కృష్ణా నీళ్ల మంటలు
(అమరావతి,న్యూస్ఇన్)
గత వారం, పది రోజులుగా తెలంగాణాలో రాజుకుంటున్న కృష్ణా జలాల వివాదం ఏపీకి పాకింది. ముఖ్యమంత్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దూమారం రేపుతున్నాయి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణా ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ గులాబీ పార్టీ ఆందోళనలకు సిద్ధం అవుతున్నామని ప్రకటించింది. దీనికి పులిస్టాప్ పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా పావులు కదపడం మొదలు పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావడం, గ్లోబల్ సమ్మిట్ పేరుతో భారీగా పెట్టబడులు ఆకర్షించామని చెప్పుకునేందుకు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు.నీటి వాటాల్లో అన్యాయం జరిగేందుకు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు అధికార పార్టీ అసెంబ్లీని వేదికగా చేసుకుంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి బీఆర్ఎస్ వైఖరి కారణమని చెప్పింది. ఈ చర్చలో భాగస్వామ్యం అయిన సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు హట్ హాట్ గా మారాయి.

కృష్ణ జలాల్లో బీఆర్ఎస్ అన్యాయం చేసి రాయలసీమ ప్రాంతానికి నీటిని తరలించుకుపోయే విధంగా ఏపీకి సహకరిస్తే చంద్రబాబు చెవిలో చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించానని రెవంత్ రెడ్డి అన్నారు. సీఎం మాటాలపై విశ్వాసంతో కాంగ్రెస్ నేతలు ఇదే వాదనను బలంగా వినిపించారు. ఇది గడిచి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ లో అధికార పార్టీ నేతలు స్పందించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు చెవిలో చేప్పినప్పుడు ఆ పథకం ఆగలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే NGT ఈ ప్రాజెక్టుపై స్టే విధించిందని అప్పటి నుంచి పనులు జరగడం లేదని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావ్ ప్రకటించారు. ఇక్కడే ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడా రేవంత్ వ్యాఖ్యలు కొత్త అస్త్రాన్ని అందించినట్లయ్యాయి. రాయల సీమ ఎత్తి పోతల పథకం చంద్రబాబు అపారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆ ప్రాంత ప్రతిపక్ష పార్టీ నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చంద్రబాబు వైఖరిని ఎండగడుతున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ఈ విషయాన్ని చెప్పారని ప్రస్తావిస్తున్నారు.2014 లో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆ సమయంలో ఓటు కు నోటు కేసు నమోదు కావడంతో కేసిఆర్ కు భయపడి నోరు మెదపలేదని, రెండోసారి సీఎం అయిన చంద్రబాబు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న శిశ్య వాత్సల్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపి వేశారని ఏపీసీఎం పై రాజకీయంగా విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి.

రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు చెప్పి రాయలసీమ పథకాన్ని అపించిందే నిజమైతే…వైసీపీ వాదనలకు బలం చేకూరినట్లే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. రేవంత్ చెబితే మా రాష్ట్ర ప్రయోజనాలను మేము తాకట్టు పెట్టుకుంటామా అని ఏపీ అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ ట్రాప్ లో పడకుండా తప్పించుకనే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కృష్ణా జలాల వాటాలో ఇరికించారన్నచర్చ మొదలైంది. . ఇప్పటి వరకు తెలంగాణా కే పరిమితమైన కృష్ణ జలాల వివాదం రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.








Leave a Reply