NewsInn

News in a Click

హ‌రీష్ విచార‌ణ కోసం సుప్రీం ను ఆశ్రయించిన స‌ర్కార్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ పెద్ద‌ల‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న నేత‌ల‌ను విచార‌ణ‌కు పిలుస్తున్న సిట్ ట్యాపింగ్ పై సీరియ‌స్ గా దృష్టి పెట్టింది. ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం సృష్టిస్తున్న ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష పార్టీని మాన‌సికంగా దెబ్బ‌కొట్టే విధంగా పావులుక‌దుపుతోంది. ఫోన్ ట్యాపింగ్ విష‌యంలో మాజీ మంత్రి హ‌రీష్ రావ్ ను విచార‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వేసిన పిటీష‌న్ రేపు విచార‌ణ‌కు రానుంది. గ‌తంలో హ‌రీష్ రావ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నార‌ని సిద్దిపేట‌కు చెందిన చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే నేత పంజాగుట్టా పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. హరీష్ రావు పై నమోదైన ఎఫ్ఐఆర్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం మ‌రో పిటీష‌న్ వేసింది. ఈ పిటీష‌న్ సోమ‌వారం విచార‌ణ‌కు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *