హరీష్ టార్గెట్ గా మరోసారి రెచ్చిపోయిన కవిత
(హైదరాబాద్,న్యస్ఇన్)
మజీమంత్రి హరీష్ రావ్ పై కవిత మరో సారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నదీజలాల వివాదం రాజుకోవడంతో కవిత కు మరింత కలిసి వస్తున్నట్లయింది. హరీష్ రావ్ పై ఉన్న ఆగ్రహాన్ని కవిత తీసుకునేందుకు నదీజలాల వివాదంతో మరింత అవకాశం కల్పించినట్లయింది. గత ప్రభుత్వం తెలంగాణాకు ఇబ్బందుల లేకుండా నిర్ణయాలు అమలు చేసిందని గులాబీ పార్టీ చెబుతుంటూ….కవిత మాత్రం గులాబీ పార్టీ సీనియర నేత హరీష్ భుజాలపై తుపాకి పెట్టి బీఆర్ ఎస్ పార్టీని అటాక్ చేస్తోంది. హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ముందు తరువాత కూడా సాగునీటి రంగంలో ఆయన తీసుకున్న నిర్ణయాలే తప్పిదమని కవిత మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది.

హరీష్ రావ్ ను ఉద్దేశించి మీరు మంత్రి పదవి వెలగ బెడుతున్నప్పుడే పోతిరెడ్డిపాడు కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచిండ్రు కదా అని నిలదీసింది.శ్రీశైలంలో అవసరమైతే బురదల నుంచి కూడా నీళ్లు తీసుకునేలా 797 అడుగుల నుంచి రాయలసీమ ఎత్తిపోతల మోటార్లు పెట్టే పనులు చేసింద మీరు కాదా అని ప్రశ్నించింది.ఎల్లూరు పంపు హౌస్ (పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఫస్ట్ పంపు హౌస్) ను ఓపెన్ కట్ నుంచి అండర్ గ్రౌండ్ కు మార్చి నీటిని తీసుకునే ఇన్ టేక్ పాయింట్ ను 800 అడుగుల నుంచి 824 అడుగులకు పెంచి ఏపీ శాశ్వత జల దోపిడీకి ఊతం ఇచ్చింది నువ్వు కదా? అంటూ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.పదేండ్లలో పాలమూరు లో కమీషన్లు వచ్చే పంపు హౌస్ పనులు తప్ప కాల్వలు, టనెల్ల పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది.జూరాల నుంచే పాలమూరు చేపట్టి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చిన ప్రాజెక్టుగా రక్షణ ఉండేది కదా.. దాన్ని కాదనుకుని కమీషన్లు కోసం శ్రీశైలానికి మార్చింది నిజం కాదా అని కవిత వ్యాఖ్యలు చేశారు.
ఇరిగేషన్ మంత్రిగా నీ దందాలు, కమీషన్ల వ్యవహాలు గురించి జలసౌథలో కథలు కథలుగా చెప్తారు గుర్తుపెట్టుకో దయ్యాలు వేదాలు వల్లించినట్టు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నం చేయకే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే ప్రయత్నాలు చేస్తే బిడ్డా.. ఇది చైతన్యం పులుపుకున్న తెలంగాణ గడ్డ అన్న ముచ్చట యాది పెట్టుకో అంటూ హరీష్ కు వార్నింగ్ ఇచ్చింది.

వ్యక్తిగా వెళుతున్నా…..శక్తిగా వస్తా…..
శాసనమండలి నుంచి తాను ఓ వ్యక్తిగా వెళ్లి ….ఓ శక్తిగా తిరిగి వస్తానని కవిత వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో చివరి సారి ప్రసంగించే అవకాశం ఇవ్వాలని మండలి చైర్మన్ ను కోరిన కవిత తాను ప్రసంగిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను రాజీనామా చేసి నాలుగు నెలలైనా రాజీనామా ఆమోదించకపోవడంతో సభా ముఖంగా మారోసారి మండలి చైర్మన్ న్ తన రాజీనామాను ఆమోదించాలని కోరారు.చైర్మన్ ఆమోదించినా, ఆమోదించకపోయినా.. ఇక తాను ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఉపయోగించుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్ల కవితవెల్లడించారు. ఇకమండలి సమావేశాలకు కూడా హాజరు కానని కవిత ప్రకటించారు. అనంతరం అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు.








Leave a Reply