NewsInn

News in a Click

అండ‌ర్-19 ఫైన‌ల్స్ లో వైభ‌వ్ షో….!

అండ‌ర్-19 ఫైన‌ల్స్ లో వైభ‌వ్ షో….!

2026 ఎడిష‌న్ బ్యాటింగ్ రికార్డుల‌న్నీ బుడ్డోడి పేరుపైనే

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్‌)

అండ‌ర్ -19 ప్ర‌పంచ క‌ప్ లో భార‌త యువ సంచ‌ల‌నం (14 ఏళ్ల బాలుడు ) ఏక‌ప‌క్షంగా మ్యాచ్ ముగిసేలా చేశాడు. ఫైన‌ల్స్ లో ముందుగా బ్యాటింగ్ భార‌త జ‌ట్టు త‌ర‌పున ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా రంగంలోకి దిగిన వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఫైనల్ ఫోబియా ఏమాత్రం లేకుండా య‌ధావిధిగా వేసిన బంతుల‌ను ఫోర్లు, సిక్స‌ర్లు గా మలుస్తూ ప్ర‌పంచ దిగ్గజ క్రికెట‌ర్ల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. టీ-20ల్లో ఆడుతూ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించిన ఈ యువ సంచ‌ల‌నం ప్ర‌పంచ క‌ప్ లో త‌న ఆట‌తో ప్ర‌పంచ క్రికెట్ కు తాను భార‌త జ‌ట్టు త‌రుపున రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాన‌న్న సంకేతాలు ఇచ్చారు.

భారీ ఇన్నింగ్స్ తో ఇంగ్లాడ్ ను ఎక్క‌డా కోలుకోలేని విధంగా ఫైన‌ల్స్ లో వైభ‌వ్ షో చేశారు. కేవ‌లం 80 బంతులు ఎదుర్కొన్న యువ ఆట‌గాడు 175 ప‌రుగులు చేశారు. ఇందులో 15 సిక్స్ లు, 15 ఫోర్లు ఉన్నాయి. ఈ 30 బంతుల్లోనే 150 ప‌రుగులు చేసిన‌ట్లు కూడా మ‌నం లెక్ఇంచ వ‌చ్చు. 175 ప‌రుగులో 150 ప‌రుగులు ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే రాబ‌ట్ట‌డంతో ప్ర‌పంచ క్రికెట్ లో త‌న‌కు ఓ పేజీని సృష్టించుకున్నారు. అండ‌ర్ -19 ప్ర‌పంచ క్రికెట్లో ఓ అరుదైన రికార్డును వైభ‌వ్ ఈ మ్యాచ్ ద్వారా సృష్టించారు. కేవ‌లం 55 బంతుల్లో సెంచ‌రీ మార్క్ ను అందుకున్నారు. వైభ‌వ్ ఇన్నింగ్స్ ఎన్నో కొత్త రికార్డుల‌ను సృష్టించింది. ప్ర‌పంచ క‌ప్ ఎడిష‌న్ లో అత్య‌ధికంగా సిక్స్ లు(30) కొట్టిన క్రికెట‌ర్ గా రికార్డు సృష్టించారు. ఫైన‌ల్స్ లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్ గా కూడా వైభ‌వ్ రికార్డుల‌కెక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *