అధికారులకు పలు సూచనలు
ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని ఆదేశం
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు వారాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ పై నిత్యం సమీక్ష నిర్వహిస్తూ తెలంగాణ విజన్ ను ప్రపంచానికి తెలియచెప్పేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సోమ మంగళ వారాలు జరిగే ఈ సమ్మిట్ కోసం ఏర్పాటు దాదాపు పూర్తయ్యాయి. ఏర్పాట్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి రెండు మూడుసార్లు పరిశీలించారు. శనివారం దేవరకొండ పర్యటనకు వెళ్ళిన సీఎం…. మరోసారి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారుల పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఈ సమావేశాలకు హాజరవుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎవరికి ఇబ్బందులు రాకుండా ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశీ ప్రతినిధులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వ్యాపారవేత్తలు, ఆయా సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా సర్కార్ ఈ సమ్మిట్ను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కొంతమంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రెండు రోజుల సొమ్మెట్ ద్వారా ఒప్పందాలు పలు సంస్థలతో ప్రభుత్వం చేసుకునే అవకాశం ఉంది.విజన్ 2047 పేరుతో ప్రభుత్వం భవిష్యత్తులో తమ కార్యాచరణను అమలు చేసేందుకు రెడీ అవుతుంది.







Leave a Reply