NewsInn

News in a Click

రాష్ట్ర భ‌విష్య‌త్ కోసమే స‌మ్మిట్

రాష్ట్ర భ‌విష్య‌త్ కోసమే స‌మ్మిట్

ఇది ఎకనమిక్ సమ్మిట్

సోమవారం 1.30 గంట‌ల‌కు ప్రారంభం

మోడీ,రాహుల్,ప్రియాంక,రానట్లే

ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఈ నెల 8, 9 తేదీల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ – 2025 స‌మ్మిట్ ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఇది పూర్తిగా ఎక‌న‌మిక్ స‌మ్మిట్ అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా నిర్వ‌హిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్, ఐఎస్బీ -హైద‌రాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జ‌రిగిందన్నారు. ఈనెల 8 న మధ్యాహ్నం 1:30 కు తెలంగాణ గ్లోబెల్ రైజింగ్ 2025 స‌మ్మిట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ ప్రారంభిస్తారని ఆయ‌న చెప్పారు. ఫ్యూచ‌ర్ సిటీలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం అత్యంత సంతోష‌క‌రంగా ఉందన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత రెడ్డి నాయ‌క‌త్వంలోని మొత్తం కేబినెట్ అంతా క‌లిసి ఆలోచ‌న‌లు చేసి విజ‌న్ డాక్యుమెంట్ రూపొందించిన‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో అంత‌ర్జాయ స్థాయిలో పేరొందిన ఎక‌నమిస్టులు ప్ర‌సంగిస్తారని ఉప ముఖ్య‌మంత్రి తెలిపారు.

తెలంగాణ రైజింగ్ గ్లొబెల్ స‌మ్మిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్ర‌తినిధులు పాల్గొంటున్నట్లు ఉప ముఖ్య‌మంత్రి వివ‌రించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్ర‌తినిధులు ఈ స‌మ్మిట్ లో పాల్గొంటున్న‌ట్లు భ‌ట్టి విక్ర‌మార్క వివ‌రించారు. రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తున్నాము. స్వ‌యంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.ఇండిగో విమానయాన సర్వీసుల సమస్యతో ముఖ్యమైన వారికి ఇబ్బంది త‌లెత్తితే ప్రత్యేక విమామాలను ఏర్పాటు చేస్తామ‌ని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

మోడీ,రాహుల్,ప్రియాంక,రానట్లే….

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీలు హాజరవుతారనుకున్నా పార్లమెంట్ సమావేశాల కారణంగా వారంతా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. గ్లోబల్ సదస్సుకు అందరికీ సమాచారం ఉండాలన్న ఆలోచనతోనే తాము ఆహ్వానాలు పంపిణీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి వెల్లడించారు. మమత బెనర్జీ తాను ఈ సమ్మిట్ కు హాజరుకాలేనని ప్రకటించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ మాత్రమే సమ్మిట్ కు హాజరయ్యే అవకాశాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *