నేను ప్రచారానికి రాను- గెలిచే బాధ్యత మీదే
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)

సంగారెడ్డి నియోజకవర్గంలోని రెండు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగిరేలా పార్టీ కార్యర్తలు పనిచేయాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి సూచించారు. నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అదికారంలోకి వచ్చిన తరువాత, మున్సిపల్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఎక్కడా టికెట్లు కేటాయించేది లేదని స్పష్టం చేశారు. టికెట్ల కోసం గాంధీ భవన్ వెళ్లి మీరుఇబ్బంది పడొద్దు….నన్ను ఇబ్బంది పెట్టొద్దన్నారు. తన సతీమణి ఇర్పనిర్మలా జగ్గారెడ్డి మాత్రమే ప్రచారానికి వస్తారని ప్రకటించారు. మరో మూడేళ్లు మనే అధికారంలో ఉంటామని పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి హామీలైనా ప్రజలకు ఇవ్వవచ్చన్నారు. ముఖ్యంత్రితో మాట్లాడి ఆ హామీలు అమలు చేసే బాధ్యత మాత్రం తాను తీసుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. రిజర్వేషన్లుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని గత ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసిన వారు ఆ ప్రాంతాల్లో కీలక బాధ్యతలు మళ్లీ తీసుకోవాలన్నారు. తాను కష్టపడడంతో గతంలో బీజెపీ సంగారెడ్డి మున్సిపల్ స్థానం గెలుచుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు ప్రభుత్వపథకాలు చెప్పంది…. హామీలు ఇవ్వండి….గెలుపొందండి అంటూ సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి,సదాశివ్ పేట నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించారు.సంగారెడ్డి మున్సిపాలిటీ కి తో పాజీ అనంత్ కిషన్, చిదృప్ప రఘు, జార్జ్, బొంగుల రవి ఇంచార్జ్ లుగాచ సదాశివపేట మున్సిపాలిటీకి, సిడిసి చైర్మెన్ రాంరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఆంజనేయులు , వాసిం భాయ్ ఇంచార్జ్ లు గా నియమించారు. రిజర్వేషన్ల పై సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గా కూన సంతోష్ ఉంటారని, ఎస్సీ రిజర్వ్ అయితే మహేష్ లాల్ చైర్మెన్ అభ్యర్థిగా ఉంటారని వెల్లడించారు. వైస్ చైర్మన్ అభ్యర్థి గా షఫీ హఫీజ్ ఉంటాడు







Leave a Reply