NewsInn

News in a Click

ముఖ్య‌మంత్రికి మూటలు మోయ‌డం త‌ప్ప ఏం తెలియదు

ముఖ్య‌మంత్రికి మూటలు మోయ‌డం త‌ప్ప ఏం తెలియదు

న‌దులు, నీళ్ల‌పై క‌నీస అవ‌గాహ‌న లేదు

కేసిఆర్ సీఎం కావాల‌ని ప్ర‌జ‌లు క‌సితో ఉన్నారు

సీఎం రేవంత్ పై కేటిఆర్ ఫైర్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి పాల‌న చేయ‌డం సాధ్యం కావ‌డం లేద‌ని, కేవ‌లం మూటలు మోయ‌డం త‌ప్ప మ‌రేమి తెలియ‌ద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు.కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్ ల‌ను అభినందించేందుకు ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటిఆర్ సీఎం పై ఫైర్ అయ్యారు. న‌దీ జ‌లాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ వైఖ‌రి కార‌ణంగానే అన్యాయం జ‌రుగుతోంద‌ని, న‌దులు, నీళ్ల కేటాయింపుల‌పై సీఎంకు అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతోనే ఈ ప‌రిస్థితివ‌చ్చింద్నారు. ప్రాజెక్టులు ఎక్క‌డున్నాయో కూడా రేవంత్ రెడ్డికి తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు దాటిపోయింద‌ని, గ‌త బీఆర్ ఎస్ పాల‌న‌కు కాంగ్రెస్ పాల‌న‌కు ప్ర‌జ‌లు బేరీజు వేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అవ‌స్థులు ప‌డుతున్నార‌ని అయినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేద‌న్నారు.

ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు, ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతు భీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు కేసీఆర్‌కు ఉరివేయాలని రేవంత్ రెడ్డి అంటున్నాడా అని కేటిఆర్ ప్ర‌శ్నించారు.వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశార‌ని ఆరోపించారు.మొదటి సంవత్సరమే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ని, ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డిని ఉరి తీయాలా అని వ్యాఖ్యానించారు.

మున్సిపాల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిద్దాం…

రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా కారు గుర్తు నుంచి పోలీ చేసే అభ్య‌ర్థుల‌ను పెద్ద ఎత్తున గెలిపించుకోవాల‌ని కేటిఆర్ పిలుపునిచ్చారు. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం ఎంత నిర్భందం చేసినా గులాబీ నేత‌లు విజ‌యం సాధించార‌ని,రాబోయే ఎన్నిక‌ల్లో కూడా క‌సి తో ప‌ని చేసి గులాబీ పార్టీ అబ్య‌ర్థుల‌ను గెలిపించాల‌న్నారు.జనగామలో ర్యాలీని చూస్తే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు అనిపించిందని కేటిఆర్ వ్యాఖ్యానించారు.ఈ ప‌రిస్థితి చూస్తుంటే కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్న‌ట్లు ఉంద‌న్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేకున్నా అన్ని పదవులు ఇచ్చిన పార్టీని వదిలి కడియం రేవంత్ రెడ్డితో కలిశాడన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *