NewsInn

News in a Click

పాల‌మూరు గులాబీ నేత‌ల ప్రాజెక్టుల పోరుబాట‌

పాల‌మూరు గులాబీ నేత‌ల ప్రాజెక్టుల పోరుబాట‌

జూరాల‌ను సంద‌ర్శించిన గులాబీ నేత‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కృష్ణా జ‌లాల పై వివాదం రాజుకున్న నేప‌త్యంలో గులాబీ పార్టీ ఆందోళ‌న‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేర‌కు నేత‌లు ప్రాజెక్ట‌ల సంద‌ర్శ‌న‌ను మొద‌లు పెట్టారు. పాల‌మూరు జిల్లాలో కృష్ణ న‌దీ ప్ర‌వేశిస్తుండ‌డంతో ఆ జిల్లా నేత‌లే కృష్ణా జ‌లాల‌పై పోరుబాట‌లో ముందు వరుస‌లో ఉన్నారు. ఇటీవ‌ల పార్టీ అధినేత నిర్వహించిన స‌మావేశంలో క్షేత్ర స్థాయిలో అమ‌లు చేయాల్సిన వ్యూహాల‌పై నేత‌ల‌కు కేసిఆర్ ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రాజెక్టుప‌రిధిలోని జిల్లాలు, మండ‌లాల్లో గ్రామాలకు వెళ్లి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఈ వ్యూహంలో భాగంగానే పార్టీ అమ‌లుచేస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికే క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌లు మాజీ మంత్రులు, పార్టీ నేత‌లు మొద‌లు పెట్టారు. కృష్ణా న‌దీజ‌లాల్లో కీల‌క‌మైన జూరాల ప్రాజెక్టును పాల‌మూరుజిల్లా నేత‌లుసంద‌ర్శించారు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి కార‌ణంగా పాల‌మూరు, న‌ల్గొండ‌,రంగారెడ్డి జిల్లాల్లో సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎద‌ర్కోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌ల‌ను చేప‌ట్టేందుకు గులాబీపార్టీ సిద్ధం అవుతోంది. తొలి విడ‌త‌లో జిల్లా స్థాయి వ‌ర‌కు ఆందోళ‌న‌లు చేయాల‌ని గులాబీ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది.అనంత‌రం మూడు జిల్లాల్లో భారీ బ‌హిరంగ స‌భ‌లను నిర్వ‌హించాల‌న్న యోచ‌న‌లో గులాబీ పార్టీ ఉంది. ప్రాజెక్టుల సంద‌ర్శ‌న గులాబీ నేత‌లు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రితో జ‌రుగుతున్న న‌ష్టాన్ని వివ‌రించారు.

బీఆర్ ఎస్ నేత‌ల వ్యాఖ్య‌లు వారి మాట‌ల్లోనే…

జూరాలను 19 టిఎంసి ల నుండి 11 కి తగ్గించి 9 కి కాంగ్రెస్ కట్టింది

జూరాల ప్రాజెక్టు లో నీటి నిల్వ తక్కువగా ఉంటుంది.

జూరాల వద్ద పాలమూరు రంగారెడ్డి చేపడితే ఎక్కువ ముంపు ఉండేది..

ఆనాడు ఇంజినీర్ లతో ఆలోచించి ప్రాజెక్ట్ సోర్స్ మార్చినం.

డెబ్బై టీఎంసీ ల నీళ్ళు జూరాల నుండి ఎలా తీసుకెళతాం..

దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రాజెక్ట్ సందర్శన చేపట్టాం..

శ్రీశైలం వద్ద ఫిబ్రవరి,మార్చి వరకు నీటిని ఎత్తిపోయచ్చు..

కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు..

కొడంగల్ ఎత్తిపోతల పథకం వృధా……ప్రజాధనం వృధా అవుతుంది..

ఇప్పటికే మక్తల్ లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్టు కింద నీళ్లు ఇవ్వొచ్చు..

కేసీఆర్ గొప్పగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు..

మంత్రి,ముఖ్యమంత్రి ఇద్దరు అవగాహన లేకుండా ఉన్నారు..

జిల్లా నుండి ముఖ్యమంత్రి ఉన్నా ఉపయోగం లేదు..

కాంగ్రెస్ మంత్రులు ప్రాజెక్టు ల మీద దుష్ప్రచారం చేస్తున్నారు..

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తె ఆరు నెలల్లోపే పాలమూరు రంగారెడ్డి నుండి మేము నీళ్ళు ఇచ్చే వాళ్లం

సీఎం,ఇరిగేషన్ మంత్రి డైలాగ్ లు కొట్టుడు కాదు ప్రాజెక్టు పూర్తి చేయాలి..

ప్రాజెక్టు పూర్తి చేయకపోతే జిల్లా ప్రజల తరుపున పెద్దఎత్తున ఉద్యమం చేపడతాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *