అవకతవకలను సరిచేయండి
మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)

తాండూరు మున్సిపాల్టీ ఓటర్ల జాబితా గందరగోళం ఉందని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత రెడ్డి కోరారు.ఓటర్ల జాబితాను సమగ్రంగా పరివీలించి తప్పుడు ఓటర్ల పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. వార్డు మ్యాపింగ్ ప్రకారం ఓటర్ల జాబితాను సరి చేసి రూపొందించాలని కోరారు. ఓటర్ల జాబితాపై ఎన్నో అనుమానాలు వస్తున్నాని వాటిని సరిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు వినతిపత్రాన్ని మాజీఎమ్మెల్యే అందచేశారు. తాజాగా విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలో గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నట్లు రోహిత్ రెడ్డి తెలిపారు. వార్డుల వారిగా జరిగిన ఓటర్ల విభజన కూడా చాలా గందరగోళంగా ఉందన్నారు.2019–2020 మున్సిపల్ ఎన్నికల సమయంలో తాండూరు పట్టణంలో మొత్తం ఓటర్ల సంఖ్య 64,090గా ఉండగా, 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ సంఖ్య 66,304కు పెరిగిందన్నారు. అంటే నాలుగేళ్ల వ్యవధిలో కేవలం 2,214 ఓటర్ల మాత్రమే పెరుగుదల నమోదు కాగా తాజాగా 2026 సంవత్సరానికి విడుదలైన ఓటర్ల జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 77,110 అంటే 2023 తర్వాత రెండేళ్ల కాలంలోనే 10,806 ఓటర్లు అదనంగా నమోదైనట్లు ఓటర్ల జాబితా చూస్తే తెలిసిపోతుందన్నారు. అధికారులు వెంటనే ఓటర్లజాబితాను సరిచేయాలని రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు.






Leave a Reply