NewsInn

News in a Click

క‌విత రాజీనామా ను ఆమోదించిన మండ‌లి చైర్మ‌న్

క‌విత రాజీనామా ను ఆమోదించిన మండ‌లి చైర్మ‌న్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

బీఆర్ ఎస్ పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత త‌న ఎమ్మెల్సీ ప‌ద‌విని వ‌దులుకుంటాన‌ని ప్ర‌క‌టించిన క‌ల్వ‌కుంట్ల క‌విత అప్పుడే ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. దాదాపు నాలుగు నెల‌ల క్రితం ఆమె రాజీనామా ప‌త్రాన్ని మండ‌లి చైర్మ‌న్ కు పంపించారు. అయితే ఇప్పటి వ‌ర‌కు ఆమోదించ‌క‌పోవ‌డంతో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని ప్ర‌త్యేకంగా క‌లిసి త‌న రాజీనామాను ఆమోదించాల‌ని కోరారు. అంత‌కు ముందు మండ‌లిలో ఒక‌సారి మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని క‌విత మండ‌లి చైర్మ‌న్ గుత్తాను కోరారు. క‌విత విజ్ఙ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి స‌భ‌లో క‌విత‌కు మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పించారు. నిజామాబాద్ లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆమె త‌నకు రాజ‌కీయంగా బీఆర్ ఎస్ పార్టీలో ఎదురైన అవ‌మానాల‌ను వివ‌రించారు. అమె స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఆమె మాట్లాడిన మ‌రుస‌టి రోజునే స‌మావేశాలు ముగియ‌డంతో చివ‌రి రోజున క‌విత రాజీనామాను ఆమోదిస్తూ మండ‌లి చైర్మ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *