NewsInn

News in a Click

విజ‌య్ ద‌ళ‌ప‌తికి సీబీఐ విచార‌ణ నోటీసులు

విజ‌య్ ద‌ళ‌ప‌తికి సీబీఐ విచార‌ణ నోటీసులు

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్‌)

త‌మిళ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారిన విజ‌య ద‌ళ‌ప‌తి పొలిటిక‌ల్ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా జ‌రిగిందో అంతే విషాదం నింపింది. టీవీకే స‌భ‌కు భారీగా జ‌నం రావ‌డంతో తొక్కిస‌లాట జ‌రిగి జాతీయ స్థాయిలో ఈ ఘ‌ట‌న విషాదం నింపింది.టీవీకే అధినేత‌గా సినీ న‌టుడు విజ‌య్ కు ప్రాధాన్య‌త‌న ఈ తొక్కిస‌లాట‌తో తేట‌తెల్ల‌మైంది. కానీ ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రుపాల‌ని డిమాండ్ రావ‌డంతో భారత అత్యున్నత న్యాయ స్థానం స్పందించింది. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌ను సీబీఐకి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించేందుకు తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్‌ కి ఇవాళ సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఈ నెల 12న విచారణకు రావాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీ (Dehli)లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, హీరో విజయ్ టీవీకే పార్టీ కరూర్‌లోని వేలుసామిపురం లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 40 మందికి పైగా మరణించగా, వంద మందికి పై గాయపడ్డారు. ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే, విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *