NewsInn

News in a Click

ప్రజారోగ్యంతో చెలగాటమాడితే చర్యలు తప్పవు

సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రిక‌

పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారుల స‌మ‌న్వ‌యం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

నగరంలో ఆహార కల్తీని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు. కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఆహార క‌ల్తీని నిరోధించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో నగర సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన స‌న్నాహ‌క సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదని, ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే ‘హత్యాయత్నం’గానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా, కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *