NewsInn

News in a Click

అసెంబ్లీ ఆత్మ స్థుతి…. ప‌ర‌నిందలా జ‌రిగింది

బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్వ‌హించిన అసెంబ్లీ స‌మావేశాలు ఆత్మ‌స్థుతి ప‌ర‌నింద‌లా జ‌రిగాయ‌ని అసెంబ్లీలో బీఆర్ ఎస్ పార్టీ విప్ వివేకానంద అన్నారు. ఎలాంటి బిజినెస్ ఎజెండా లేకుండానే చ‌ర్చ మొద‌లు పెట్ట‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. ఐదు రోజుల పాటు జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో హ‌డావుడిగా 13 బిల్లుల‌ను ప్ర‌భుత్వం ఆమోదింప‌చేసుకుంన్నారు. బీఏసీ స‌మావేశంలో 15 రోజులు స‌భ నిర్వ‌హించాల‌ని ప్ర‌ధాన ప్రథ‌ప్ర‌తిప‌క్ష పార్టీగా తామ‌డు డిమాండ్ చేసినా….బీఏసీ ఎజెండాను ప్ర‌భుత్వం బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

అసెంబ్లీలో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ చ‌ట్ట‌విరుద్ధం అని వారించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే ప‌నిచేసింద‌న్నారు.బీఆర్ ఎస్ పార్టీకి అసెంబ్లీలో మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా కేసిఆర్ ను తిట్టేందుకు అంతా ఒక్క‌టై ఐదు రోజులు అసెంబ్లీ స‌మావేశాల‌ను నిర్వ‌హించార‌ని చెప్పారు.శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డిప్యూటీ సీఎం నిర్వ‌హించే శాఖ‌ల‌పై త‌న అనుభ‌వాన్ని వివ‌రించార‌ని వివేక్ చెప్పారు. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వ‌ల‌న్నారు.రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని తానే చంద్ర‌బాబుతో మాట్లాడి ఆపించాన‌ని అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పార‌ని, కానీ ఏపీ ప్ర‌భుత్వం మ‌రుస‌టి రోజే సీఎం వ్యాఖ్య‌లు త‌ప్ప‌ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని గుర్తు చేశారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాష త‌ల‌దించుకునేలా ఉంద‌ని వివేక్ వ్యాఖ్యానించారు. శాస‌న‌స‌భ‌ను ఒక సీఎల్పీ మీటింగ్ లా సీఎం రేవంత్ నిర్వ‌హించార‌ని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *