NewsInn

News in a Click

ఆవకాయ్ ఫెస్టివల్‌కు గాయకుడు ‘జావేద్ అలీ’

ఆవకాయ్ ఫెస్టివల్‌కు గాయకుడు ‘జావేద్ అలీ’

యువతలో నూతనోత్సాహం

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

ఆవ‌కాయ్ ఫెస్టివల్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు రావడం పట్ల ప్ర‌ముఖ సింగ‌ర్ జావేద్ అలీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వేడుకుల‌కు హాజ‌ర్యేందుకు ముందు ఆయ‌న వీడియోను విడుదల చేశారు. “ఆంధ్రా ప్రజల ప్రేమాభిమానాల మధ్య, వారి సమక్షంలో నా గాత్రాన్ని వినిపించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుక కేవలం రుచులకే పరిమితం కాకుండా, సంగీత విభావరితో ప్రేక్షకులను అలరించనుందని ఆయన తెలిపారు.రాష్ట్ర రాజధానిలో అత్యంత వైభవంగా జరగనున్న ‘అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్’ కు ఒక ప్రత్యేక ఆకర్షణగా జావేద్ అలీ నిలువ‌నున్నారు. సినీ రంగంలో తన మధురమైన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ జావేద్ అలీ ఈ వేడుకల్లో పాల్గొన‌డం యువ‌తో కొత్త ఉత్స‌హాన్ని నింపుతోంది.

విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన గాయకుడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ చిత్రంలోని “చూపే బంగారమాయెనే.. శ్రీవల్లి” పాటతో జావేద్ అలీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే, ‘ఉప్పెన’ చిత్రంలో ఆయన పాడిన “నీ కన్ను నీలి సముద్రం” సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ పాటకు గాను ఆయన ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా విమర్శకుల ప్రశంసలు మరియు అనేక అవార్డులను అందుకున్నారు.

జావేద్ అలీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, ఒడియా, తమిళం మరియు ఉర్దూ వంటి పలు భారతీయ భాషల్లో వేలాది పాటలు పాడి, భారతీయ సంగీత రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు.జావేద్ అలీ వంటి ప్ర‌ముఖ‌ గాయకుడు ఈ ఫెస్టివల్‌కు వస్తుండటంతో, యువత మరియు సంగీత ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, ఆవకాయ్ రుచులను ప్రపంచానికి చాటిచెప్పే ఈ వేడుక జావేద్ అలీ రాకతో మరింత కలర్‌ఫుల్‌గా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *