(న్యూస్ఇన్, సినిమా)
ధురందర్-2 పై బిగ్ ఆప్ డేట్ వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 12.12 గంటలకు ధరంధర్ 2 టీజర్ ను విడుదల చేస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.రణ్ వీర్ సింగ్ నటించిన ధరంధర్ విజయవంతం కావడంతో ధురంధర్ 2 పేరుతో సీక్వెల్ ను సినిమా యూనిట్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సోషల్ మీడియాలో ఆ యూనిట్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇది డ్రిల్ కాదు….ఇది హైప్ మాత్రమే కాదు…ఇది ఒక్క కషణం….అనే లైన్ తో చేసిన పోస్టు నెటిజన్లలో ఆసక్తి రేపుతోంది.

ధురంధర్ ఊహించిన దాని కంటే బాక్సాఫిస్ వద్ద భారీగా వసూళ్లు చేయడంతో కొత్త సీక్వెల్ పై అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి. మార్చి 19 న మీ ముందుకు పార్ట్ 2 పేరుతో సోషల్ మీడియా లో పోస్టులు ఒక్క సారిగా వైరల్ గా మారాయి. గుడి పడ్వా, ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ రెడీ చేస్తున్నట్లు పోస్టర్ల ద్వారా తెలుస్తోంది.










Leave a Reply