- అభిషేక్ బ్యాటింగ్…..
భారత్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వే మినహా ప్రపంచకప్ లో ఏ మ్యాచ్ లో కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేదు.

ఫైనల్స్ లో టాస్ గెలిచి న్యూజీలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో అభిషేక్ తొలిసారి అంచనాలకు అనుగుణంగా ఫైనల్స్ లో 18 పరుగుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. పవర్ ప్లేలోనే భారత్ వికెట్ నష్టపోకుండా భారీ స్కోరు నమోదు చేసుకుంది.
- సంజూ శాంసన్ కీలక’ ఇన్నింగ్స్…
అభిషేక్ ఔట్ అయ్యాక ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా శాంసన్ భారత స్కోరును ముందుకు నడిపించారు. సంజు42 బంతుల్లో 89 పరుగులు చేసి భారత జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచారు. కీలక మ్యాచ్ లలో సంజు శాంసన్ ఆడిన తీరు అందరికీ ఆకట్టుకుంది. టీంలోకి వస్తూ, పోతూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే సంజు నైపుణ్యంతోనే భారత జట్టు కీలక మ్యాచ్ లో విజయం సాదించడం ప్రపంచ కప్ ద్వారా తేలిపోయింది.

- ఇషాన్ కిషన్ అటాకింగ్ మోడ్….
తొలివికెట్ కోల్పోయిన తరువాత వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్, రన్ రేట్ ఏమాత్రం తగ్గకుండా కివీస్ బౌలర్లపై అటాక్ మొదలు పెట్టారు. నాణ్యమైన స్పిన్నర్లుగా కీవీస్ స్పిన్నర్లకు గుర్తింపు ఉన్నా… ఇషాన్ కిషన్ వారిపై వత్తిడి పెంచేలా బ్యాటింగ్ చేశారు. 23 బంతుల్లోనే 55 పరుగులు చేశారు. దీంతో భారత జట్టు రన్ రేట్ 12 పరుగులకు తగ్గకుండా సాగింది.
- శివమ్ దూబే’ మెరుపులు….
భారత జట్టును 16వ ఓవర్ తీవ్రంగా దెబ్బ తీసింది. భారీ స్కోరు దిశగా పయనిస్తున్న సమయంలో నీషమ్ వేసిన ఒకే ఓవర్లో 3 వికెట్లను భారత్ కోల్పోయింది. ఆతరువాత బ్యాటింగ్ వచ్చిన శివం దూబె నీషమ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో భారత్ స్కోరు ఒక్కసారిగా 255/5కి చేరుకుంది.

- యార్కర్ కింగ్ బూమ్రా…..
భారత జట్టు భారీ స్కోరు చేయడంతో….. బౌలర్లు, ఫీల్డర్లు తమ బాధ్యతను నిర్వహించారు. న్యూజీలాండ్ బ్యాటర్ల క్యాచ్ లు డ్రాప్ అయినా….. పెద్దగా ప్రభావంపడకుండా చూసుకోగలిగారు. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజీలాండ్ను పవర్ప్లేలోనే భారత బౌలర్లు దెబ్బతీశారు. జస్ప్రీత్ బుమ్రా తన మొదటి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసి పరుగుల ప్రవాహాన్ని నియంత్రించాడు.చివర్లో కీలక వికెట్లు పడగొట్టి న్యూజీలాండ్ ను తీవ్రంగా దెబ్బకొట్టారు. మరోవైపు, అక్షర్ పటేల్ తన స్పిన్ మ్యాజిక్తో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. . ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్ మ్యాచ్కే హైలైట్ గా నిలుస్తోంది.


Leave a Reply