సీరీస్ లో 1-0 ఆధిక్యం
న్యూజీలాండ్ ను షేక్ చేసిన అభిషేక్
(స్పోర్ట్స్ డెస్క,న్యూస్ఇన్)
ఇండియా – న్యూజిలాండ్ మధ్య ఈ రోజు జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు వినోదం అందించింది. ఇరు జట్లు తమ బలాన్ని ప్రదర్శించాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో భారీ విజయలక్ష్యాన్ని న్యూజీలాంట్ జట్టు ముందు ఉంచింది. ఇండియా ఇన్నింగ్స్ మొదట్లోనే ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఓపెనర్లు క్రీజ్లో స్థిరపడేందుకు కొంత సమయం తీసుకున్నా…. ఆ తర్వాత దూకుడు పెంచారు. ప్రధానంగా టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ అకాశమే హద్దుగా చెలరేగాడు. న్యూజీలాండ్ బౌలర్లు ఎవరు బౌలింగ్ చేసినా….బౌండరీలు, సిక్సర్లతో నాగ్ పూర్ స్టేడియంలో జోష్ నింపారు.

న్యూజిలాండ్ స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో పరుగుల వేగం కొంత తగ్గింది. ఇదే సమయంలో ఒక కీలక వికెట్ పడటం మ్యాచ్కు కొత్త మలుపు తీసుకొచ్చింది. అయితే భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు బాధ్యతా యుతంగా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కొద్ది సమయంలోనే క్రీజు వీడడంతో హర్ధిక్ పాండ్య, శివం దూబేలు కొద్దిసేపు పరుగులు రాబట్టారు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన రింకు సింగ్ తన విశ్వరూపం ప్రదర్శించారు. న్యూజీలాండ్ బౌలర్లకు రింకు బ్యాట్ తో చుక్కలు చూపించారు. భారీ లక్ష్య చేధనకు దిగిన న్యూజిలాండ్ స్కోరు మొదలు పెట్టక ముందే వికెట్ కోల్పోయింది. తొలి రెండు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోవడం కొన్ని ఓవర్ల పాటు న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లు ఆచి తూచి పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారు. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లు క్రీజులో కుదుట పడిన తరువాత రన్ రేట్ ను కొనసాగిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి న్యూజీలాండ్ ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఇక్కడ ఇందియా vs న్యూజిలాండ్ మ్యాచ్ పూర్తి స్కోర్ వివరాలు:
మ్యాచ్ ఫలితం:
భారత్ 48 పరుగుల తేడాతో గెలుపు 5 మ్యాచ్ సిరీస్లో 1-0తో ఆధిపత్యం
భారత్ ఇన్నింగ్స్:
📍 238/7 (20 ఓవర్లు)
అభిషేక్ శర్మ: 84 పరుగులు
రింకూ సింగ్: 44* (నాటౌట్)
సూర్యకుమార్ యాదవ్: 32
న్యూజిలాండ్ ఇన్నింగ్స్:
📍 20 ఓవర్లలో — 190/7
గ్లెన్ ఫిలిప్స్: 78 పరుగులు
టిమ్ రాబిన్సన్: 21




Leave a Reply