- సౌత్ ఆఫ్రికా ఘన విజయం
(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
టీ-20 ఐసీసీ ప్రపంచ కప్ లో భారత్ కు తొలి పరాభవం ఎదురైంది. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ చతికిల బడింది. తొలి ఓవర్ నుంచే భారత బ్యాట్స్ మెన్లు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. 188 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయింది.
పరుగుల ఖాతా ప్రారంభించక ముందే ఫాం లో ఉన్న ఇషాన్ కిషన్ తొలివికెట్ గా వెనుదిరిగారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ కూడా తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి పరుగులేమి చేయకుండానే వెనుదిరిగారు.భారత స్కోరు 5 పరుగులకు చేరుకునే లోపే రెండు కీలక వికెట్లను కోల్పోయింది.

ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్, అభిషేకర్ శర్మలు భారత స్కోరును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ లో టచ్ లోకి వచ్చారని భావిస్తున్న సమయంలోనే భారీ షాట్ ఆడబోయి ఔటయ్యారు. 12 బంతులను ఎదుర్కొని 15 పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో కుదురుకున్నటే కనిపించినా ఆ ఇద్దరు కూడా వెనువెంటనే ఔటయ్యారు. దీంతో భారత జట్టు 10 ఓవర్లలోపే సగం వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లోకూరుకు పోయింది. శివం దుబె, హర్ధిక పాండ్యాలు కొన్ని ఓవర్ల పాటు దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొన్నారు. రన్ రేట్ ఓవర్ కు 15 పరగులు చేయాల్సి ఉండడంతో భారీ షాట్ ఆడబోయే హర్దిక్ 88 పరుగల వద్ద ఔటయ్యారు.

ఆ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రింకూ సింగ్ కూడా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరుకున్నారు. దీంతో భారత జట్టు ఓటమి ఖరారైంది. 88 పరుగలకు 8 వికెట్లు కోల్పోయింది. కేశవ్ మహారాజ్ వేసిన 15వ ఓవర్లో భారత్ ఒకే ఓవర్లో 3 వికెట్లు హర్దిక్ పాండ్య, రింకూ సింగ్, అర్షదీప్ లను కోల్పోయింది. ఓటమి ఖరారైందన్న మాదిరిగా భారత బ్యాటర్లు వెనువెంటనే పెవిలియన్ చేరుకున్నారు. కేశవ్ 2 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చినా తన మూడో ఓవర్లో 2 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు. భారత బ్యాటర్లు నిర్లక్ష్యానికి ఈ మ్యాచ్ ద్వారా భారీ మూల్యం చెల్లించుకున్నారు. వికెట్లు వరుసగా పడుతున్నా…. శివం దూబె ఆదుకోవడంతో భారత్ 16 వ ఓవర్లో 100 పరుగుల మైలురాయిని దాటింది. 8 వికెట్లు కోల్పోయిన తరువాత 20 ఓవర్లు బ్యాటింగ్ చేయడమే లక్ష్యంగా భారత్ ఆటగాళ్లు ఆడారు. జన్సెన్, బోస్చ్ లు కీలక వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాకు బ్రేక్ థ్రూ ఇచ్చారు. భారత జట్టులో శివం దుబే అత్యధిక స్కోరర్ గా నిలిచారు.37 బంతుల్లో 42 పరుగులు చేశారు. అంతకు మందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.భారత జట్టులో నలుగురు బాటర్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. ఇద్దరు ఒక్క పరుగు మాత్రమే చేశారు. ఆరుగురు బ్యాట్సమెన్లు కలిసి చేసిన స్కోరు ఆరు పరుగులు మాత్రమే.
స్పిన్ కు దాసోహం….ప్రపంచ కప్ మొదలైన నాటి నుంచి స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు సతమతమవుతున్న భారత బ్యాటర్లు ఈ మ్యాచ్ లో కూడా స్పీన్నర్లకే దాసోహమన్నారు. ఇషాన్ కిషన్ తొలి వికెట్ గా మార్కరమ్ బౌలింగ్ లో ఔట్ కాగా కేశవ్ మహారాజ్ 3 వికెట్లు దక్కించుకున్నారు.





Leave a Reply