భారత్- జింబాబ్వే ,వీండీస్- సౌత్ ఆఫ్రీకా మ్యాచ్ లపై అందరి దృష్టి
(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
టీ-20 ప్రపంచ కప్ లో ఫెవరేట్ గా బరిలో దిగిన భారత జట్టుకు ఒక్క ఓటమి ఎన్నోపాఠాలు నేర్పింది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత బ్యాటింగ్, బౌలింగ్ పరిశీలించి ఈ సారి భారత్ కు తిరుగులేదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ప్రపంచ కప్ మొదలైన నాటి నుంచి భారత జట్టు అన్ని విభాగాల్లో తమ వైపల్యాలను ఎదుర్కొంటూనే ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో పత్యర్థి జట్లకు అవకాశం దక్కేలా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు ప్రపంచ కప్ మ్యాచ్ లో నాలుగు గ్రూప్ దశలో విజయం సాధించింది. ఇందులో మూడు జట్లు పసికూనల జట్లుగానే భావించవచ్చు.కానీ పాకిస్తాన్ పై విజయం భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఆ తరువాత లీగ్ దశ మొదటి మ్యాచ్ లో భారత్ భారీ పరాభవాన్ని ఎదుర్కోక తప్పలేదు. దక్షిణాఫ్రికా జట్టు భారత్ పై ఘన విజయం సాధించి ప్రపంచ కప్ లో భారత్ ముందుడుగు వేయాలంలే భారత జట్టు తదుపరి మ్యాచ్ లలో విజయం సాదించడంతో పాటు ఇతర జట్ల ఆట తీరుపై కూడా భారత జట్టు భవితవ్యం ఆధార పడేలా చేసింది.సౌత్ ఆఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓటమి చెందడమే ఇందుకు ప్రధాన కారణమైంది.
ఈ రోజు సాయంత్ర భారత్ జింబాబ్వే జట్ల మద్య మరో మ్యాచ్ జరుగనుంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మ్యాచ్ పై భారత అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందకంటే లీగ్ దశలో జింబాబ్వే జట్టుతో తలపడ్డ ఆస్ట్రేలియా జట్టు ఓటమితో ప్రపంచ కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఫుల్ పాంలో ఉన్నారు వెస్టీండీస్ తో జరిగిన సూపర్ 8 దశలో మ్యాచ్ లో వీండీస్ జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిచిత్తుచేసింది. దీంతో తదుపరిరెండు మ్యాచ్ లలో విజయం దక్కించుకోవాలని జింబాబ్వే కూడా అన్నిప్రణాళికలను అమలు చేయనుంది.

భారత్ క్రికెట్ జట్టుది కూడా దాదాపు అదే పరిస్తితి లీగ్ దశలో అన్ని మ్యాచ్ లలో విజయం దక్కించుకున్నా సూపర్8 లో మ్యాచ్ లను పరాజయంతో మొదలు పెట్టింది. భారత జట్టును గత కొన్ని రోజులుగా ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. అభిషేక్ పై ఎన్నో ఆశలు పెట్టున్నా ఈ ప్రపంచ కప్ మొత్తం 5 మ్యాచ్ లో ఇప్పటి వరకు అభిషేక్ స్కోరు 18 పరుగులు మాత్రమే. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ దక్షిణాఫ్రికా మ్యాచ్ మినహా ఇతర మ్యాచ్ లో భారీగా పరుగులు చేశారు. ఓపెనింగ్ భాగస్వామ్యం మెరుగు పడితే ఆ తరువాత వచ్చే బ్యాటర్లు స్కోరు పెంచేందుకు అనుగుణంగా తమ వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంటుంది. పవర్ ప్లే లో భారత జట్టు ఏ మేరకు బ్యాటింగ్ లో రాణిస్తుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న అంశం. ఇక ఈ ప్రపంచ కప్ లో తొలి నుంచి భారత బ్యాటర్లపై స్పిన్ బౌలర్లదే హవా నడుస్తోంది. ప్రత్యర్థి జట్లు పవర్ ప్లేలోనే స్పిన్నర్ లను రంగంలోకి దించి భారత జట్టుకు కళ్లేం వేయడంలో విజయవంతం అవుతున్నారు. ఇక బౌలింగ్ లో బూమ్రా పై నే అందరి ఆశాలు, హర్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వరణ్ చక్రవర్తిలు ఇక రాబోయే మ్యాచ్ లో రాణించే అవకశాలను బట్టి భారత జట్టు ప్రపంచ కప్ లో సెమిఫైనల్స్ కు చేరుకోవడం ఆధారపడి ఉంది. జింబాబ్వే, వెస్టీండీస్ జట్లతో తలపడే భారత్ ఈ రెండు మ్యచ్ లలో విజయం సాధిస్తే తప్ప సెమిస్ పై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.
వీండీస్ మ్యాచ్ పై కూడా ఆసక్తి….

ఈ రోజు ప్రపంచ కప్ లో జరిగే రెండు టీ-20 మ్యాచ్ లు భారత్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.సూపర్ 8 క్వాలిఫై కావాలంటే భారత్ కు 50శాతమే ఆవకాశలున్నాయి.టీం ఇండియా కు మాత్రం సూపర్ 8 వెళ్లాలంటే నేడు జరిగే రెండు మ్యాచ్లు కీలకం. మొదటి మ్యాచ్ లో వెస్టిండీస్ తో సౌత్ ఆఫ్రికా తలబడునుంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధిస్తే భారత్ కు సూపర్ 8 కు మెరుగుపడుతాయి. వెస్టిండీస్ చేతి లో సౌత్ ఆఫ్రికా ఓటమిపాలైతేభారత్ తదుపరి 2 మ్యాచ్ లలో భారీ టార్గెట్ తో గెలిచి మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాల్సిన అవసరం ఉంటుంది.ఈ మ్యాచ్ ఫలితం ప్రభావం భారత జట్టు భవిష్యత్తు ను నిర్ణయించనుంది. దీంతో ఈ రోజు జరిగే రెండు మ్యాచ్ లు భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. వీండీస్ ఈ ప్రపంచ కప్ లో ఊహించని విధంగా రాణిస్తుండడంతో సౌత్ ఫ్రికా జరిగే మ్యాచ్ కూడా ఆసక్తి రేపుతోంది.




Leave a Reply