NewsInn

News in a Click

టీ-20 ఫైన‌ల్స్ కు భార‌త్-న్యూజీలాండ్ సిద్ధం

టీ-20 ఫైన‌ల్స్ కు భార‌త్-న్యూజీలాండ్ సిద్ధం
  • ఆదివారం అహ్మ‌దాబాద్ లో ముగింపు

(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ ఇన్‌)

ఐసీసీ టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ పోరుకు భార‌త్, న్యూజీలాండ్ జ‌ట్లు పోరుకు సిద్ధం అవుతున్నాయి. ఆదివారం అహ్మాదాబాద్ లో జ‌రుగ‌నున్న మ్యాచ్ పై ఎవ‌రి లెక్క‌లు వారికి ఉన్నాయి. టైటిల్ ఫెవ‌రెట్ గా భార‌త్ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుండ‌గా మ‌రోసారి భార‌త్ పై విజ‌యం సాధించాల‌ని న్యూజీలాండ్ ఊవ్విళ్లూరుతోంది. గ‌తంలో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిని ఫైన‌ల్ మ్యాచ్ ల‌లో న్యూజీలాండ్ విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు కూడా మ‌రోసారి తమ‌కే విజ‌యం వ‌రిస్తుంద‌న్న ధీమా ఆ జ‌ట్టులో క‌నిపిస్తోంది.

అయితే భార‌త జ‌ట్టు గ్రూప్, లీగ్ ద‌శ‌లో త‌డ‌బ‌డుతూ విజ‌యం సాధించినా…. సెమీఫైన‌ల్స్ మ్యాచ్ లు ఆడే వ‌ర‌కు జోరు పెంచింది. భార‌త జ‌ట్టుకు ఓపెనింగ్ స‌మ‌స్య వేధిస్తున్నా….. క‌లిసి క‌ట్టుగా బ్యాట‌ర్లు రాణించ‌డంతో భారీ స్కోరును భార‌త్ సాధిస్తోంది. త‌ప్ప‌క గెలువాల్సిన మ్యాచ్ లో వెస్టీండీస్ పై భార‌త్ విజ‌యం ద‌క్కించుకోగా… ఉత్కంఠ‌గా సాగిన సెమీస్ లో భార‌త్ భారీ స్కోరును న‌మోదు చేసినా ఇంగ్లాండ్ కూడా అంతే ధీటుగా భార‌త్ కు జ‌వాబు ఇచ్చింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ చేరుకోక‌పోవ‌డ‌తో భార‌త్ ఫైన‌ల్స్ చేరుకుంది.దీంతో అత్య‌ధిక సార్లు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఫైన‌ల్స్ చేరుకున్న జ‌ట్టుగా భార‌త్ రికార్డు సృష్టించింది.

న్యూజీలాండ్ కూడా సెమీస్ లో ద‌క్షిణాఫ్రికాను చిత్తు చేసింది. న్యూజీలాండ్ బౌల‌ర్లు సెమీస్ లో ద‌క్షిణాఫ్రికాను 200 ప‌రుగుల లోపే ప‌రిమితం చేయాల‌న్న ల‌క్ష్యంగా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపింది. అనుకున్న‌ట్లే సౌతాఫ్రికాను న్యూజీలాండ్ క‌ట్ట‌డి చేసింది. ఇక బ్యాటింగ్ ఆ జ‌ట్టు ఓపెన‌ర్ విధ్వ‌సం సృష్టించి కేవ‌లం 33 బంతుల్లో ఫిన్ అలెన్ సెంచ‌రీ చేయ‌డంతో ద‌క్షిణా ఫ్రికా సెమీఫైన‌ల్ నుంచి వెనుదిరుగాల్సి వ‌చ్చింది.

భార‌త జ‌ట్టు బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు చేసిన మ్యాచ్ నుంచి స్కోరు బోర్డు ప‌ర‌గులు పెడుతోంది. సంజు శాంస‌న్ గ‌త రెండు మ్యాచ్ ల‌లో ఫాంను అందుకున్నారు. ఇషాన్ కిష‌న్, సూర్య‌కుమార్, తిల‌క్ వ‌ర్మ‌, హార్ధిక్ పాండ్య‌, శివం దుబె లు జ‌ట్టు స్కోరును వేగంగా పెంచే ప‌నిలో ప‌డుతున్నారు.

అయితే ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ మొద‌లైన నాటి నుంచి భారత్ జ‌ట్టును అభిషేక్ శ‌ర్మ ఫాం లేమి వెంటాడుతోంది. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్ లో మిన‌హా ఏ మ్యాచ్ లోనూ అభిషేక్ రాణించ‌క‌లేక‌పోయారు. లీగ్ ద‌శ‌లో ప‌రుగులేమి చేయ‌కుండానే వెనుదిరిగారు. ఆ త‌రువాత కూడా పెద్ద‌గా స్కోరు చేయ‌లేక‌పోయారు. ఫైన‌ల్ మ్యాచ్ లో అభిషేక్ రాణిస్తార‌ని భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లంతా ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఓపెనింగ్ లో అభిషేక్ రాణిస్తే జ‌ట్టు స్కోరు ఊహించ‌ని విధంగా పెరుగుతుండ‌నంలో అతిశ‌యోక్తి లేదు.

ఇక బౌలింగ్ ద‌ళాన్ని ప‌రిశీలిస్తే….బూమ్రా, అర్షదీప్ ల‌కు తోడుగా ఆల్ రౌండ‌ర్ గా హ‌ర్దిక్ పాండ్య తొలి ఓవ‌ర్ల‌లోనే ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల వికెట్లు తీస్తే డిఫెన్స్ లో వేస్తున్నారు. ప‌వ‌ర్ ప్లేలో వీరిని ఎదుర్కోవ‌డం అగ్ర‌శ్రేణి బ్యాట్స్ మెన్ల‌కు కూడా అవ‌స్త‌లు త‌ప్ప‌వు న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్లు కూడా బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు త‌మ వ‌ద్ద ప్రణాళిక‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు.

స్పిన్న‌ర్ల విష‌యానికి వ‌స్తే టీ-20 ప్ర‌పంచ నం.1 బౌల‌ర్ వ‌ర‌ణ్ చ‌క్ర‌వ‌ర్తి గ‌త మ్యాచ్ లో అత్యధిక ప‌రుగులు ఇచ్చుకోవ‌డంతో ఫైన‌ల్ మ్యాచ్ లో వ‌రుణ్ కు అవ‌కాశం ద‌క్కుతుండా కుల్దీప్ ను భార‌త్ రంగంలోకి దించుతుందా అన్న‌ది ఆస‌క్తి రేపుతోంది. న్యూజీలాండ్ స్పిన్ ద‌ళాన్ని కెప్ట‌న్ సాంట్న‌ర్ స‌మ‌ర్ద‌వంతంగా ముందుకు న‌డిపిస్తున్నారు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్ లో స్పిన్న‌ర్లు ప్రోటీస్ ను త‌క్కువ స్కోరుకే ప‌రిమితం చేశారు. ర‌చిన్ ర‌వీంద తో పాటు మ్యాట్ హెన్నీ, ఫెర్గూస‌న్ లో కూడా టీ 20 ప్ర‌పంచ‌క‌ప్ లో రాణిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *