- ఫైనల్స్ లో న్యూజీలాండ్ పై ఘన విజయం
(స్సోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
భారత జట్టు ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఆదివారం లక్షమంది ప్రేక్షకుల మధ్య అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్స్ లో ఘన విజయం సాధించింది. న్యూజీలాండ్ టాస్ గెలిచినా ముందు బౌలింగ్ ఎంచుకుంది. ఇక అంది వచ్చిన అవకాశంగా ఇండియా దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం విజయ వంతం అయింది. ప్రపంచ కప్ మొదటి నుంచి ఫాం కోల్పోయి విమర్శల పాలైన అభిషేక్ ఈ మ్యాచ్ లో మెరిషారు.

ప్రపంచకప్ లోనే ఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టు ఓపెనర్లు అధ్బతమైన ప్రారంభాన్ని ఇచ్చారు. కేవలం 8 ఓవర్లలోనే 98 పరుగులు చేశారు. ఫాం లేమితో సతమతం అవుతున్న అభిషేక్ ఈ మ్యాచ్ లో తన ఆటతో న్యూజీలాండ్ బౌలర్లకు చుక్కలు చూపారు. 18 బంతుల్లో హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో వైపు సంజు శాంసన్ ఈ మ్యాచ్ లోకూడా తన సత్తా చాటారు. సంజు వెస్టీండీస్ తో జరిగిన మ్యాచ్ నుంచి విరుసగా రాణిస్తూ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సెంచరీలు నమోదు చేయకపోయినా భారత్ కు విలువైన పరుగులు చేశారు. తన క్రికెట్ కేరీర్ లో అత్యుత్తమ ప్రద్శనతో భారత్ కు టీ-20 ప్రపంచకప్ విజేతంగా నిలిచేందుకు పూర్తి స్థాయిలో సహాకారాన్ని అందించారు.

వెస్టీండీస్, ఇంగ్లాండ్ లో జరిగిన లీగ్, సెమీ ఫైనల్స్ లో మాదిరిగానే ఫైనల్స్ కూడా రాణించారు. దీంతో 44 బంతుల్లో 89 పరుగులు చేసి ఔంటయ్యారు 16వ ఓవర్లో సంజు ఔటైన వెంటనే మరో ఇద్దరు భారత బ్యాటర్లు ఔటయ్యారు. సంజుతో కలిసి 3వ వికెట్ కు విలువైన భాగస్వామ్యం అందించారు. మూడో వికెట్ క్పలోయే వరకు భారత జట్టు 16 వ ఓవర్ లో 204 పరుగుల చేసింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు స్కోరు పెంచే ప్రయత్నాలుచేసి వెంట వెంటనే వెనుదిరిగారు. అయితే చివర్లో శివం దూబె భారీ షాట్లతో భారత్ 255 పరుగుల స్కోరు చేరుకుంది.

256 పరుగుల లక్ష్యంగా బరిలో దిగిన న్యూజీలాండ్ భారీ స్కోరు ఛేదించే క్రమంలో భారత బౌలర్ల ఉచ్చలో పడింది. పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోవడంతో తీవ్ర కష్టాల్లో పడింది. ఓపెనర్ సిఫర్ట్ మినహా ఎవరూ పెద్దగా స్కోరు చేయడంతో ఆ జట్టు బ్యాట్స్ మెన్లు విజయవంతం కాలేకపోయారు. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి కీవిస్ 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది.16వ ఓవర్లో న్యూజీలాండ్ రెండు వికెట్లు కోల్పోవడంతో కీవీస్ ఓటమి ఖరారైంది. బూమ్రా 4, అక్షర్ పటే ల్ 3 వికెట్లు తీసుకోగా ఇషాన్ కిషన్ 3 క్యాచ్ లు అందుకున్నారు. 19వ ఓవర్ లో న్యూజీలాండ్ అలౌట్ అయింది.చివరి వికెట్ ను అభిషేక్ శర్మ తీసుకున్నారు. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ కావడంతో న్యూజీలాండ్ పై ఇండియా ఘన విజయాన్ని సాధించింది.

Leave a Reply