రెండున్నర లక్షలకు డీల్
అడ్వాన్సుగా రూ.1.5లక్షలు
(హైదరాబాద్, న్యూస్ఇన్)

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామ వ్యవసాయ క్షేత్రంలో ఓ భవన నిర్మాణానికి అనుమతి కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోవడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య ,ఎంపీఓ తేజ్ సింగ్, ఎంపీడీవో సుమతి, ముగ్గురి సమక్షంలో మొదట ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. రెండున్నర లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే లక్ష యాభై వేల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మిగతా లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి పట్టుబడ్డారు.ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Leave a Reply