NewsInn

News in a Click

కలిసే ఉందాం నాన్న…. హీరో అవుతా అన్నారు

కలిసే ఉందాం నాన్న…. హీరో అవుతా అన్నారు

క‌నిపించ‌కుండా పోయారు ఓ తండ్రి ఆవేద‌న‌

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నలుగురు విద్యార్థుల మృతి

(హైదరాబాద్, న్యూస్ఇన్)

రంగారెడ్డి జిల్లా మోకిల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.మిర్జాగూడ సమీపంలో అదుపు తప్పిన స్పోర్ట్స్ కారు చెట్టును డీకొట్టింది.ప్రమాదంలో నలుగురు ICFAI కాలేజ్ విద్యార్థుల సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని చికిత్స అందిస్తున్నారు.

మృతదేహాలను చేవెళ్ల ఆసుపత్రికి పోలీసులు తలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు. తోటి విద్యార్థులు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు.ఒకే ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.ఫ్రెండ్స్ పుట్టిన రోజు వేడుక‌ల కోసం కోకాపేట్ లో ఉండడంతో వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.

కలిసే ఉందాం నాన్న….త్వరలో హీరో అవుతా సురేష్ చివరి మాటలు….

తొందరలోనే హీరో అవుతాను అని నాన్నతో చెప్పిన సూర్యతేజ… అంతా ఒకేచోట కలిసి ఉందాం అని సూర్య తేజ తన తండ్రితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తు చేస్తూ తల్లిదండ్రులు వినిపిస్తున్నారు. కలిసి ఉందాం అంటూ కలలు కన్న కొడుకు కళ్ళేదుటే మృతదేహంగా చూడాల్సి వస్తుందని అనుకోలేదని అనుకోలేదని రోదించడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నాకు కలలో వచ్చావని చెప్పిని ఫోన్ చేసి అమ్మ దగ్గరికి వెళ్ళమని తనకు చెప్పారని తండ్రి అరుణ్ కుమార్ రోదిస్తూ చెప్పారు.సూర్యకు మద్యం, మాంసాహారం అలవాట్లు లేవన్నారు. ICFAl లో BBA చదువుతున్నట్టు అరుణ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *