NewsInn

News in a Click

అమరావతికి చట్టబద్దత కల్పించండి

అమరావతికి చట్టబద్దత కల్పించండి

VB-G RAM G లో మిన‌హాయింపులు ఇవ్వండి

అమిత్ షాతో భేటీలో సీఎం చంద్రబాబు

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీలో వెళ్లిన సీఎం చంద్ర‌బాబు కేంద్ర హోమంత్రి అమీత్ షాను క‌లిసి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై చ‌ర్చించారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు… రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని చెప్పారు.\

అలాగే ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని… ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *